పవన్ కల్యాణ్​పై జగన్ వాఖ్యలను ఖండించిన జనసేన - సీఈఓకు ఫిర్యాదు - Janasena Leaders Complain to CEO

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 19, 2024, 10:48 PM IST

thumbnail

Janasena Leaders Complained to CEO about CM Jagan Comments on Pawan Kalyan: సీఎం జగన్ ఈ నెల 16వ తేదీన భీమవరంలో తమ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్​పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ జనసేన ప్రధాన కార్యదర్శి శివశంకర్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్​ కుమార్ మీనాకు (AP CEO Mukesh Kumar Meena) ఫిర్యాదు చేశారు. సీఎం జగన్ వ్యాఖ్యలు కోడ్ ఉల్లంఘన కిందకే వస్తాయని సీఈఓకి చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మోడల్ కోడ్​కు విరుద్ధంగా పవన్ కల్యాణ్​పై వ్యక్తిగత జీవితం గురించి జగన్ మాట్లాడారని (CM Jagan Comments on Pawan Kalyan) శివశంకర్ అందులో స్పష్టంగా పేర్కొన్నారు. రాష్ట్రంలోని మహిళల్ని కించపరిచేలా సీఎం జగన్ రోడ్ షోలో ప్రసంగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సానుభూతితో గెలిచేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానించారు. జగన్ డ్రామాలను ప్రజలు తిప్పి కొట్టే రోజు దగ్గర్లోనే ఉందని  అన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.