ఘనంగా గుణదల మేరీమాత పుణ్యక్షేత్ర నూరు వసంతాల ఉత్సవాలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 9, 2024, 12:25 PM IST

thumbnail

Gunadala Churchu Centenary Celebrations Begin : విజయవాడలోని గుణదల మేరీమాత పుణ్యక్షేత్ర నూరు వసంతాల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాలను విజయవాడ కథోలిక పీఠాధిపతి బిషప్ జోసఫ్ రాజారావు సమష్టి దివ్య బలి పూజతో ప్రారంభించారు. శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ ఏడాది ప్రత్యేక ఏర్పాట్లు చేశామని బిషప్ రాజారావు తెలిపారు. ఈ వేడుకలలో వాటికన్ రాయబారి లియోపోల్డో జిరెల్లి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారని బిషప్ వెల్లడించారు. 
Gunadala Mother Mary Shrine : మూడు రోజుల పాటు జరుగనున్న ఈ తిరునాళ్లను పీఠాధిపతి తెలగతొటి జోసఫ్ రాజారావు లాంఛనంగా ప్రారంభించారు. ఉత్సవాల్లో భాగంగా ఈ ఏడాది ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, దేశంలోనే నలుమూలల నుంచి తిరుణాళ్ల మహోత్సవానికి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొనే అవకాశం ఉందని బిషప్ తెలిపారు. మూడు రోజులపాటు నిర్వహించే ఈ నూరు వసంతాల వేడుకలు ప్రత్యేక ప్రార్థనలతో లూర్ధు మాత పుణ్యక్షేత్రం మొత్తం ఆధ్యాత్మిక శోభ నెలకొంటుందని వివరించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.