వరుసగా మూడోసారి వన దేవతలను దర్శించుకోవడం ఆనందంగా ఉంది : గవర్నర్ తమిళిసై

By ETV Bharat Telangana Team

Published : Feb 23, 2024, 2:17 PM IST

thumbnail

Governor Tamilisai Visits Medaram Sammakka Saralamma Temple : మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో గవర్నర్​ తమిళిసై పాల్గొన్నారు. హైదరాబాద్​ నుంచి హెలికాప్టర్​లో కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్​ ముండాతో కలిసి గవర్నర్​ మేడారం చేరుకున్నారు. అనంతరం వనదేవతల వద్ద మొక్కులు చెల్లించుకున్నారు. ఆమె నిలువెత్తు బంగారాన్ని మొక్కుగా గవర్నర్​ చెల్లించుకున్నారు. మేడారానికి తాను వరుసగా మూడోసారి రావడం చాలా ఆనందంగా ఉందని గవర్నర్​ తెలిపారు. 

Medaram Jatara 2024 : మేడారం జాతర ఏర్పాట్లను పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వాన్ని, అధికారులను మెచ్చుకున్నారు. భారతదేశ ప్రజలందరూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని సమ్మక్క-సారలమ్మలను మొక్కుకున్నట్లు ఆమె తెలిపారు. ఈ జాతరకు రావడం చాలా సంతోషంగా ఉందని గవర్నర్​ తమిళిసై హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రజలందరికీ మంత్రి అర్జున్​ ముండా సమ్మక్క జాతర శుభాకాంక్షలు తెలిపారు. ఆలయ ప్రాంతాలను కలియతిరిగిన గవర్నర్​, కేంద్రమంత్రి అర్జున్​ముండా, రాష్ట్ర మంత్రి సీతక్క భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని అధికారులకు సూచనలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.