ఇళ్ల పట్టాలపై ఊసురుమనిపించిన సీఎం- పంపిణీ చేయకుండా వెళ్ళిపోయాడని స్థానికుల ఆందోళ

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 2, 2024, 4:31 PM IST

thumbnail

Government Did Not Give Jagananna Housing Lands : ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వస్తున్నారు. తమకు ఇళ్ల పట్టాలు ఇస్తారని ఎదురు చూసిన కృష్ణ జిల్లా పామర్రు జగనన్న ఇళ్ల లబ్ధిదారుల ఆశలపై నీళ్లు చల్లారు. జగనన్న ఇళ్ల కోసం మూడు సంవత్సరాల క్రితం కొనుగోలు చేసిన భూమిని ఇంత వరకు లబ్ధిదారులకు అందించలేదు. పామర్రులో జగనన్న విద్యా దీవెన నిధుల విడుదలకు సంబంధించి సభ జరుగుతుందని, ఆ సభ అనంతరం పట్టాలు ఇస్తామని వైఎస్సార్సీపీ నేతలు చెప్పారని లబ్ధిదారులు తెలిపారు

పామర్రు వచ్చిన సీఎం జగన్ విద్యా దీవెన నిధుల విడుదల చేసి అటునుంచి అటే వెనుదిరిగారు. ఇళ్ల పట్టాల గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేసి కోనుగోలు చేసిన భూమిని లబ్ధిదారులకు ఇవ్వకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారని నిప్పులు చెరుగుతున్నారు. ఆ స్థలం విషయంలో అధికార పార్టీ నేతలే న్యాయ పరమైన చిక్కులు సృష్టించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. ఇళ్ల పట్టాల తమకు వెంటనే ఇవ్వాలని లబ్ధిదారులు కోరుతున్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.