భూమి విస్తీర్ణాన్ని తగ్గించి ఆన్​లైన్​లో నమోదు చేసిన అధికారులు - ఆందోళనకు దిగిన రైతులు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 2, 2024, 7:47 PM IST

thumbnail

Farmers Dharna at Collector Office in Kurnool District : కర్నూలు జిల్లాలో తమ ప్రమేయము లేకుండా పట్టా భూముల విస్తీర్ణమును ఆన్​లైన్​లో అధికారులు తగ్గించారని రైతులు ధర్నా నిర్వహించారు. కోడుమూరు నియోజకవర్గం పాలకుర్తికి చెందిన రైతులు కలెక్టర్​ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. పాలకుర్తి గ్రామంలోని సర్వే నంబరు 477, 475,478 ఎనిమిది మంది రైతులకు చెందిన పొలాల్లో ఒక్కొక్కరికి 30 సెంట్లు చొప్పున తగ్గిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Palakurti Farmers : గత నాలుగు నెలల వ్యవధిలో ఎంఆర్​ఓ బి. జయన్న, డిప్యూటి తహసీల్దారు రామాంజనేయులు, వీఆర్​ఓ వెంకటరాముడు  సహాకారముతో చింతా కృష్ణమూర్తికి ఆన్​లైన్​లో భూమిని ఎక్కించారని పాలకుర్తి రైతులు ఆరోపించారు. దీనిపై కలెక్టర్​ సమగ్ర విచారణ చేసి తమకు న్యాయము చేయవలసిందింగా వినతి పత్రాన్ని అందజేశారు. తమ భూములను ఆన్​లైన్​ నందు యదావిధిగా పొందుపరచాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. తమకు న్యాయం చేసేవారు పోరాటం చేస్తామని పాలకుర్తి రైతులు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.