రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలి : నల్లారి కిరణ్‌ కుమార్‌రెడ్డి - Kiran kumar angry with Peddireddy

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 7, 2024, 7:21 PM IST

thumbnail
రాష్ట్రాభివృద్ధి కోసం మరోసారి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలి : నల్లారి కిరణ్‌ కుమార్‌రెడ్డి (ETV BHARAT)

Ex CM Kiran kumar reddy Angry with Peddireddy Ramachandra Reddy : రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబును మరోసారి ముఖ్యమంత్రిని చేయాలని మాజీ సీంఎ నల్లారి కిరణ్‌ కుమార్‌రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో అంగళ్లులో జరిగిన ప్రజాగళం సభలో ఆయన మాట్లాడుతూ, ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో దోపిడీతో రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడ చూసిన అవినీతి, అక్రమాలే రాజ్యమేలు తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పుంగనూరు నియోజకవర్గాన్ని ఒక అక్రమ సంపాదన కెేంద్రంగా చేసుకున్నపెద్దిరెడ్డి రామచంద్రరెడ్డిని ఇంటికి సాగనంపాలని పిలుపునిచ్చారు. 

పెద్దిరెడ్డి ఈ ఐదేళ్లలో దాదాపు రూ.1500 కోట్లు అక్రమంగా సంపాదించారని విమర్శించారు. ఈ నియోజకవర్గంలో ఎక్కడా పంచాయతీ, మున్సిపల్ ఎలక్షన్​లు జరగలేదని తెలిపారు. ఆ స్థానాలన్నీంటిని దౌర్జన్యం చేసి పెద్దిరెడ్డి లాక్కున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడేమో సిగ్గులేకుండా ప్రతి ఇంటికొచ్చి ఓట్లు అభ్యర్థిస్తున్నాడని విమర్శించారు. ఇలాంటి నేతలు మనకు అవసరమా? అని కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ ఐదేళ్లలో టీడీపీ కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులన్నింటి కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే తీసేస్తామని తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోవలంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని కిరణ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.