ఎన్నికల ప్రజాస్వామ్యంలో ప్రజలు భాగస్వామ్యం కావాలి: హరేంథిర ప్రసాద్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 21, 2024, 10:00 AM IST

thumbnail

Election Commission Appeals to Download C-Vigil App: ఎన్నికల్లో అక్రమాలు, ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన, నగదు, మద్యం పంపిణీ ఇలాంటి అంశాలేవైనా ప్రజలు నేరుగా ఫిర్యాదు చేసేందుకు వీలుగా సీ-విజిల్ యాప్​ను వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. తద్వారా ఎన్నికల ప్రక్రియను సజావుగా పారదర్శకంగా నిర్వహించటంలో ప్రజలు భాగస్వామ్యం వహించినట్టు అవుతుందని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు, ప్రజలు భాగస్వామ్యం వహించేలా ఎక్కువ మంది సీ-విజిల్ యాప్​ను డౌన్​లోడ్ చేసుకోవాలని ఎన్నికల సంఘం విజ్ఞప్తి చేస్తోంది. సిటిజెన్ విజిలెన్స్ యాప్​ను ప్లేస్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపింది.

ప్రజలు ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి ఫిర్యాదులైన చేయవచ్చని రాష్ట్ర ఎన్నికల అదనపు ప్రధానాధికారి హరేంధిర ప్రసాద్ స్పష్టం చేశారు. ఫిర్యాదు అందిన 100 నిమిషాల్లోనే సమస్యను పరిష్కరించేలా చర్యలు చేపడతామన్నారు. ప్రజలు ఈ యాప్ ద్వారా ఫోటోలు, వీడియోలు తీసి ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు. సీ- విజిల్ యాప్​లో వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి  జిల్లా, నియోజకవర్గాల వారీగా బృందాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఎన్నికల సంఘం కార్యాలయానికి ఫిర్యాదు చేసే బదులు సీ-విజిల్ ద్వారా ఫిర్యాదు చేస్తే అతి వేగంగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుందని విజ్ఞప్తి చేశారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.