వైఎస్సార్సీపీ హయాంలో నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటాయి : దేవినేని ఉమా

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 22, 2024, 10:45 PM IST

thumbnail

Devineni uma Fires on YCP Government in Ntr District : వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం - జనసేన కూటమి అధికారంలోకి వస్తుందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. వచ్చిన వెంటనే మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రకారం హామీలు అమలు చేస్తామని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో "బాబు షూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ" కార్యక్రమంలో దేవినే ఉమా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కరెంటు, గ్యాస్, బస్సు చార్జీలు పెంచి సామాన్యులపై అధిక భారాన్ని మోపారని మండిపడ్డారు. నిత్యవసర సరుకులు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయన్నారు.

పోరగుట్టలో ఉన్న స్థానికులకు రెండు సెంట్లు స్థలం గత తెలుగుదేశం పార్టీ హయాంలో ఇస్తే వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ పట్టాలను లాక్కొని సెంటున్నర ఇచ్చారని ధ్వజమెత్తారు. టీడీపీ- జనసేన కూటమి అధికారంలోకి వచ్చాక మరల రెండు సెంట్లు స్థలం ఇస్తామని హామీ ఇచ్చారు. మైలవరంలోని దేవుని చెరువు టీడీపీ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి జరిగిందని గుర్తు చేశారు. వైసీపీ నాయకులు చేసిందేమీ లేదని అందిన కాడికి దోచుకున్నారని విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.