LIVE: ఎమ్మిగనూరు ప్రజాగళం సభలో చంద్రబాబు - ప్రత్యక్ష ప్రసారం - Chandrababu Prajagalam Tour

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 31, 2024, 12:52 PM IST

Updated : Mar 31, 2024, 2:05 PM IST

thumbnail

Chandrababu Election Campaign Live: ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో ప్రచారాలు ఊపందుకున్నాయి. అన్ని పార్టీల అధినేతలు రంగంలోకి దిగి గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునే విధంగా హామీలిస్తున్నారు. ఇందులో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం పేరుతో ప్రచారం చేపట్టారు. ప్రచారంలో జగన్​ సర్కార్​పై నిప్పులు కురిపిస్తున్నారు. మాట తప్పను మడమ తిప్పను అని ఎన్నో హామీలిచ్చి జనాన్ని మోసం అధికారంలోకి వచ్చాడని దుయ్యబడుతున్నారు. జగన్​ పాలనలో అధోగతి పాలైన రాష్ట్రాన్ని తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పునర్వైభవం తీసుకువస్తామని స్పష్టం చేస్తున్నారు. ప్రజాగళం ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నేడు మూడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం ఎమ్మిగనూరు బహిరంగ సభలో పాల్గొననున్న చంద్రబాబు, మధ్యాహ్నం మార్కపురం రానున్నారు. మార్కాపురంలో సభ అనంతరం సాయంత్రం ఆయన బాపట్ల చేరుకుని అక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. తుది విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా నేటి వరకు చంద్రబాబు షెడ్యూలు ఖరారు అయ్యింది. మలివిడత ప్రచారం షెడ్యూల్ కి సంబంధించి ఇవాళ నిర్ణయం తీసుకోనున్నారు. ఎమ్మిగనూరు ప్రజాగళంలో చంద్రబాబు పాల్గొన్నారు. ప్రత్యక్ష ప్రసారంలో చూద్దాం. 

Last Updated : Mar 31, 2024, 2:05 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.