LIVE: కుప్పంలో చంద్రబాబు తరపున భువనేశ్వరి నామినేషన్​ - BHUVANESWARI BABU NOMINATION

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 19, 2024, 12:50 PM IST

Updated : Apr 19, 2024, 1:43 PM IST

thumbnail

LIVE: టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నేడు కుప్పంలో నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో స్థానిక ప్రసన్న వరదరాజస్వామి ఆలయంలో నామినేషన్‌ పత్రాలను ఉంచి ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం లక్ష్మీపురంలోని మసీదు ఆవరణలో ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు నిర్వహించారు. ఆ తర్వాత బాబూ నగర్‌లోని చర్చిలో ప్రార్థనలు చేశారు. మరోవైపు నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున తెదేపా, జనసేన, భాజపా కార్యకర్తలు తరలివచ్చారు. కుప్పం చెరువు కట్ట మీదుగా టీడీపీ ర్యాలీ కొనసాగుతోంది. ర్యాలీ అనంతరం చంద్రబాబు తరపున భువనేశ్వరి నామినేషన్​ దాఖలు చేశారు.కుప్పం శాసన సభ స్థానానికి చంద్రబాబు 8వ సారి పోటీ చేస్తున్నారు. ఈ దఫా లక్ష ఓట్ల ఆధిక్యం అధించేందుకు టీడీపీ నేతలు అడుగులు వేస్తున్నామన్నారు. కుప్పం అభివృద్ధికి 20 అంశాలతో మేనిఫెస్టోను రూపొందించినట్లు వివరించారు. సాయంత్రం 5 గంటలకు టీడీపీ కార్యాలయంలో ప్రముఖులతో భువనేశ్వరి ముఖాముఖి, 20న అధినేత పుట్టిన రోజు సందర్భంగా కదిరిబండ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారన్నారు. టీడీపీ కార్యాలయంలో ముస్లిం మహిళలతో ముఖాముఖిలో పాల్గొంటారన్నారు.

Last Updated : Apr 19, 2024, 1:43 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.