పులివెందుల వైఎస్సార్​సీపీలో అభద్రతా భావం నెలకొంది : బీటెక్​ రవి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 29, 2024, 3:14 PM IST

thumbnail

B Tech Ravi Comments on YSRCP: పులివెందుల నియోజకవర్గంలోని వైఎస్సార్​ కాంగ్రెస్​ పార్టీలో అభద్రతా భావం ఏర్పడిందని టీడీపీ నేత బీటెక్​ రవి విమర్శించారు. ఈక్రమంలోనే ఆ పార్టీ డబ్బుల సంచులు పంచుతోందని ఆయన విమర్శించారు. నియోజకవర్గంలోని నాయకులకు డబ్బులు ఇచ్చే స్థాయికి వైఎస్సార్​సీపీ దిగజారిపోయిందని ఎద్దేవా చేశారు. ప్రజల్లో వైఎస్సార్​సీపీ పార్టీ పట్ల వ్యతిరేకత ఉంది కాబట్టే వారు ఈ చర్యకు పూనుకున్నారని అన్నారు. 

చురుకుగా పనిచేస్తున్నందుకు నగదు అందించారని కొందరు వైఎస్సార్​సీపీ నాయకులు తనకు ఫోన్​ చేసి వివరించినట్లు బీటెక్​ రవి తెలిపారు. కార్యకర్తలకు ప్రజల్లో ఉండే ప్రభావాన్ని బట్టి ఒక్కో కార్యకర్తకు 50 వేల నుంచి 15లక్షల వరకు నగదు అందిస్తున్నారని రవి ఆరోపించారు. గతంలో వైఎస్​ షర్మిలపై వైఎస్సార్​సీపీ నాయకులు విమర్శలు చేసేవారు కాదని, ఆమె ప్రస్తుతం కాంగ్రెస్​లోకి మారడంతో అసభ్యకరమైన ట్రోల్స్​ చేస్తున్నారని అన్నారు.

సీఎం జగన్​ ఎంతటి నీచనికైనా దిగజారుతారు: ముఖ్యమంత్రి జగన్​మోహన్​ రెడ్డి రాజకీయాల కోసం ఎంతటి నీచనికైనా దిగజారుతారని బీటెక్​ రవి విమర్శించారు. వైఎస్​ షర్మిల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. విజయమ్మ జగన్​ వైపే మొగ్గు చూపే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.