ETV Bharat / state

'పాఠశాలలు తెరిచే నాటికి పుస్తకాలతోపాటు యూనిఫామ్, బ్యాగులు అందించాలి' - CS Jawahar Reddy Review meeting

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 23, 2024, 12:47 PM IST

Textbooks, Notebooks, Uniforms and Bags To Reach Students by June 12 : పాఠశాలలు ప్రారంభమయ్యేనాటికి పిల్లలకు చదువుకోవడానికి అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లపై అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

textbooks_notebooks_uniforms_bags_to_reach_students_by_june
textbooks_notebooks_uniforms_bags_to_reach_students_by_june (ETV Bharat)

Textbooks, Notebooks, Uniforms and Bags To Reach Students by June 12 : పాఠశాలలు తెరిచే జూన్ 12 నాటికి విద్యార్థులకు పుస్తకాలతోపాటు యూనిఫామ్, బ్యాగులు వంటివన్నీ అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 2024-25 విద్యా సంవత్సరం సన్నాహక ఏర్పాట్లపై విద్యాశాఖ అధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. సమీక్షలో ఆయన మాట్లాడుతూ 'మండల స్థాయి నిల్వ కేంద్రాల ద్వారా పాఠశాలలకు పుస్తకాలు తదితర వస్తువులను అందించాలి. వీటి సరఫరాపై నిత్యం ప్రత్యే కంగా పర్యవేక్షించాలి' అని సూచించారు.

CS Jawahar Reddy Review Meeting About Education Academic Year : మధ్యాహ్న భోజన పథకం అమలుపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఈ సందర్భంగా ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ మాట్లాడుతూప్రభుత్వ పాఠశాలల్లో 36,54,539 మంది విద్యార్థులు ఉన్నారని, జూన్ 10లోగా విద్యార్థులకు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఇప్పటికే 82 శాతం పుస్తకాల ప్రచురణ పూర్తి అయ్యిందని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ అన్నారు. 1 నుంచి 10వ తరగతి వరకూ బైలింగ్యూవల్ పాఠ్య పుస్తకాలను విద్యార్థులకు అందిస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి 36 లక్షల 54 వేల 539 మంది విద్యార్ధులను ఎన్రోల్ చేశామన్నారు.

'పాఠశాలలు తెరిచే నాటికి పుస్తకాలతోపాటు ఏకరూప దుస్తులు, బ్యాగులు అందించాలి' (ETV Bharat)

విద్యాకానుక లెక్కలతో బట్టబయలైన ప్రభుత్వ బాగోతం - పిల్లల సంఖ్య పడిపోయినా వెల్లడించని సర్కారు - Govt Schools Fallen Drastically

ఈ క్రమంలో అధికారులు మాట్లాడుlతూ అకడమిక్​ ఇయర్​కు సంబంధించిన కార్యక్రమలాపాల పై విస్తృత స్థాయిలో చర్చలు జరిపామని పేర్కొన్నారు.చర్చలో భాగంగా ఎంతమంది విద్యార్థులు పాఠశాలలకు రానున్నరు. తరగతులు పుస్తకాలు తదితర అంశాలపై మాట్లాడుకున్నట్లు సమాచారం. ఇంతకు ముందు కంటే చదువుకునే విద్యార్థుల సంఖ్య పెంచే దిశగా ఎదగాలని, దానికి సంబంధించిన తగిన ప్రణాళికలు సైతం సిద్ధం చేస్తున్నామని విద్యాాశాఖ అధికారులు తెలిపారు. పాఠశాలలో చదువుకునే ప్రతి విద్యార్థికి ప్రభుత్వం అందించే సేవలు మెరుగ్గా అందేలా చూసుకుంటామని పేర్కొన్నారు. నామ మాత్రపు తీరులో కాకుండా అన్ని విషయాల్లో అప్రమత్తమైన చర్యలతో విద్యాసంవత్సర అవసరాలను దృష్టిలో ఉంచుకుని అన్ని విధాలా తమ విధులు నిర్వర్తిస్తామని అధికారులు తెలిపారు.

వైసీపీ పాలనలో భ్రష్టుపట్టిన విద్యావ్యవస్థ - పిల్లల బతుకులతో జగన్​ సర్కారు ఆటలు - YCP Destroy The Education System

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.