ETV Bharat / state

ఉద్ధృతంగా సాగుతున్న ప్రచారాలు - కూటమి అభ్యర్థులకు బ్రహ్మరథం పడుతున్న ప్రజలు - 2024 Elections Campaig

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 24, 2024, 8:46 PM IST

TDP BJP Janasena Alliance
TDP BJP Janasena Alliance

TDP BJP Janasena Alliance: రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాలు ప్రచారా పర్వంలో మునిగితేలుతున్నాయి. ఈ సందర్భంగా ఓటర్ దేవుల్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. అందులో భాగంగా ఊరు వాడా అంటూ తేడా లేకుండా నేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు. సామాన్యుల సమస్యలు వింటూ ముందుకు సాగుతున్నారు. అధికారంలోకి వచ్చిన అనంతరం సమస్యలు పరిష్కరిస్తామంటూ హామీలు ఇస్తున్నారు.

కూటమి అభ్యర్థులకు బ్రహ్మరథం పడుతున్న ప్రజలు

TDP BJP Janasena Alliance: రాష్ట్రంలో ఎన్నికల వేడి ముందు వేసవి వేడి చిన్నబోతోంది. 40 డిగ్రీల పైబడిన ఎండలను సైతం లెక్కచేయకుండా అభ్యర్థులు ఊరువాడా జోరుగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఏ వీధిలో చూసినా కూటమి జెండాలు, సూపర్‌-6 నినాదాలే వినిపిస్తున్నాయి. అలుపెరగకుండా ప్రచారం సాగిస్తున్న కూటమి అభ్యర్థులకు పలుచోట్ల మహిళలు మంగళ హారతులతో బ్రహ్మరథం పట్టారు. ప్రచారంలో భాంగా ఊరు వాడ అంటూ తేడా లేకుండా కూటమి నేతలతో కలిసి ప్రజలు, టీడీపీ కార్యకర్తలు పాల్గొంటున్నారు.

మహిళలతో కలిసి పలు వార్డుల్లో ప్రచారం: విజయవాడ తూర్పు నియోజకవర్గ కూటమి అభ్యర్థి గద్దె రామ్మోహన్‌కు మద్దతుగా ఆయన భార్య, కుమారుడు నగరంలో ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ సుపర్‌ సిక్స్‌ పథకాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. డ్రైనేజీ రైలింగ్‌ సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కొండప్రాంత వాసులు వాపోయారు. పేదలకు కడుపు నిండా భోజనం పెట్టే అన్నా క్యాంటీన్లను రద్దు చేసి జగన్‌ పేదల కడుపు కొట్టారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం రాగానే డ్రైనేజీ సమస్యలు తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే తనుయులు పేర్కొన్నారు. అలాగే అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభిస్తామని భరోసా ఇచ్చారు. ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

కృష్ణప్రసాద్‌ సతీమణి శిరీష: మైలవరం కూటమి అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్‌ విజయాన్ని కాంక్షిస్తూ ఆయన సతీమణి శిరీష నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. జి.కొండూరు, ఇబ్రహీంపట్నంలో స్థానిక పార్టీ నాయకులు, మహిళలతో కలిసి పలు వార్డుల్లో ప్రచారం చేపట్టారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో కూటమి అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం చేపట్టారు. కూటమి ప్రభుత్వం వచ్చాక స్థానిక సమస్యలను వంద రోజుల్లో పరిష్కరిస్తామని భరోసానిచ్చారు.

అవినీతి రహిత పాలన కోసం: శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్‌... కుమ్మరవాండ్లపల్లి, ఎగువపల్లి గ్రామాల్లో ప్రతి గడపనూ పలకరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలోని పడుగుపాడులో ప్రచారం నిర్వహించిన కూటమి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, అవినీతి రహిత పాలన కోసం కూటమిని గెలిపించాలని కోరారు. తిరుపతిలో కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి చింతా మోహన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కేంద్రంలో భాజపా మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుందని ఆరోపించారు.
రెండో విడత పోలింగ్​కు జోరుగా ఏర్పాట్లు- రాహుల్, హేమమాలిని భవితవ్యమేంటో?​ - Lok Sabha Elections 2024

వైసీపీని నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరికలు: కూటమి ప్రభుత్వం ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ పథకాలకు ఆకర్షితులై పెద్దసంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశంలో చేరుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో 30 వైసీపీ కుటుంబాలు తెలుగుదేశంలో చేరాయి. కూటమి అభ్యర్థి తంగిరాల సౌమ్య వీరికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి ఆధ్వర్యంలో 120 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశంలో చేరాయి. అనంతపురంలో కూటమి అభ్యర్థి పోతుల నర్సింహులు సమక్షంలో 50 కుటుంబాలు తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నాయి. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ కూటమి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు సమక్షంలో కాట్రేనికోన, తాళ్లరేవు మండలాలకు చెందిన 100 మంది వైసీపీ కార్యకర్తలు సైకిలెక్కారు.

ఎండల తీవ్రతల్లోనూ ఎన్నికల ప్రచారం నిర్వహించిన టీడీపీ అభ్యర్థి బుచ్చిబాబు - Political campaigns in Hot Weather

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.