Officers Released Turtles into Musurumilli Reservoir : అల్లూరి జిల్లా రంపచోడవరం ఫోక్స్ పేట వద్ద పట్టుకున్న తాబేళ్లను ముసురుమిల్లి జలాశయంలో అధికారులు విడిచిపెట్టారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న తాబేళ్లను పోలీసులు చాకచాక్యంగా పట్టుకున్నా విషయం అందరికి తెలిసిందే. భారీ సంఖ్యలో తాబేళ్లను ఒక మినీ వ్యాన్లో తరలిస్తున్న ఇద్దరి వ్యక్తులను పోలీసు అధికారులు పట్టుకొని వాటిని రక్షించారు. కోనసీమ జిల్లా నుంచి ఒడిశా రాష్ట్రానికి పెద్ద మొత్తంలో తాబేళ్లను సంచుల్లో కట్టి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.
అక్రమంగా తరలిస్తున్న 1589 తాబేళ్లు పట్టివేత - ఇద్దరు అరెస్ట్ - Illegally Transporting Turtles
తాబేళ్లను ఒడిశాకు మినీ వ్యాన్లో తరలిస్తున్నారనే సమాచారంతో అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో ఫోక్స్ పేట అటవీ చెక్ పోస్ట్ వద్ద పోలీసు అధికారులు నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలోనే ఒడిశా వైపు వెళ్తున్న మినీ వ్యాన్ను చెక్ చేశారు. అందులో పైకి ఉల్లిపాయల రవాణా చేస్తున్నట్లు పోలీసులను నమ్మించడానికి దొంగలు కుయుక్తులు పన్నారు. వాహనం మొత్తం చెక్ చేయగా చూస్తే ఉల్లిపాయల రవాణా మాటున 20 బస్తాల్లో సుమారు 1589 తాబేళ్లు అక్రమంగా రవాణా చేస్తున్నారు. దీని విలువ సుమారు రూ. 3 లక్షల రూపాయలు ఉంటాయని పోలీస్ అధికారులు పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. గోదావరి జిల్లాలో అరుదుగా దొరికే ఈ తాబేళ్లను ఎక్కువగా ఒరిస్సాలో మాంసం కోసం ఎక్కువగా వాడుతారని, అందుకే వాటిని అక్కడికి తరలిస్తున్నట్లు తెలిపారు. పట్టుబడిన 1589 తాబేళ్లలో 163 మృతి చెంది ఉన్నాయని పోలీసు అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే మిగిలిన తాబేళ్లను ముసురుమిల్లి జలాశయంలో అధికారులు విడిచిపెట్టారు.
తాబేలుకు యాక్సిడెంట్.. ఆపై కుక్క దాడి.. 3గంటలు కష్టపడి సర్జరీ చేసిన డాక్టర్