ETV Bharat / state

అనారోగ్యంతో కుమార్తె మృతి - తట్టుకోలేక నిమిషాల వ్యవధిలోనే ఆగిన తల్లి గుండె

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 13, 2024, 3:00 PM IST

Updated : Mar 13, 2024, 4:25 PM IST

Mother Heart Attack by death of child in Anakapalli District : నిమిషాల వ్యవధిలోనే తల్లీ కుమార్తె మృతి చెందిన సంఘటన అనకాపల్లి దేవరాపల్లిలో జరిగింది. ఫిట్స్​ రావడంతో మరణించిన మేఘన చూసి ఆమె తల్లి ఉషారాణి తట్టుకోలేక పోయింది. కుమారై మరణవార్తను బంధువులకు తెలియజేస్తూ సోఫాలోనే కుప్పకూలిపోయింది.

mother_dead
mother_dead

అనారోగ్యంతో కుమార్తె మృతి - తట్టుకోలేక నిమిషాల వ్యవధిలోనే ఆగిన తల్లి గుండె

Mother Heart Attack by death of child in Anakapalli District : తన ప్రాణాలు పణంగా పెట్టి పురిటి నొప్పులు భరిస్తూ బిడ్డకు తల్లి జన్మనిస్తుంది. ఆ బిడ్డను ఎంతో అపురూపంగా పెంచి పెద్ద చేస్తుంది. ఆ బిడ్డకు చిన్నపాటి కష్టం వచ్చినా విలవిల లాడుతుంది. అలాంటిది బిడ్డ ప్రాణాలతో లేదన్న విషయాన్ని ఏ తల్లైనా భరిస్తుందా ? ఆ విషయాన్ని జీర్ణించుకోలేక ఆ బిడ్డతోనే తన పయనం అనుకొని తల్లి తుది శ్వాస విడిచింది. ఒక్కగానొక్క కుమారై కళ్ల ముందే అచేతనంగా ఉండటం చూసి తట్టుకోలేక నిమిషాల వ్యవధిలో ఆ తల్లి గుండె కూడా ఆగిపోయింది. ఈ సంఘటన అనకాపల్లి జిల్లా దేవరాపల్లిలో జరిగింది.

Mother and Daughter Died Within Minutes : విశాఖలోని ద్వారకా నగర్​కు చెందిన నిమ్మకాయల శ్రీనివాసరావు మూడేళ్ల కిందట బతుకుదెరువు కోసం అనకాపల్లి జిల్లా దేవరాపల్లికి వచ్చారు. భార్య ఉషారాణి (51), కుమార్తె సాయి మేఘనతో (18) కలిసి స్థానిక అపార్టుమెంటులో నివాసం ఉంటున్నారు. మానసిక దివ్యాంగురాలైన మేఘన కొన్నేళ్లుగా ఫిట్స్​తో బాధ పడుతోంది. మంగళవారం ఉదయం (మార్చి 12) 8 గంటల సమయంలో ఫిట్స్​ రావడంతో ఇంట్లోనే పడిపోయింది. తల్లిదండ్రులిద్దరూ ఎంత కదిపినా చలనం లేకపోవడంతో అపార్టుమెంటులోనే నివాసం ఉంటున్న డాక్టర్​ను పిలిచారు. ఆయన పరీక్షించి మేఘన మరణించినట్లు ధ్రువీకరించారు.

కళ్లెదుటే భర్తను హత్య చేసిన మేనల్లుడు- గుండెపోటుతో భార్య మృతి

Anakapalli District : అప్పటివరకు బాగానే ఉన్న తన కుమార్తె ఇక లేదన్న విషయం జీర్ణించుకోలేని మాతృమూర్తి హృదయం తల్లడిల్లింది. కుమార్తె మరణవార్తను బంధువులకు ఫోన్​లో చెప్తూ ఉషారాణి తీవ్ర మనోవేదనకు గురై సోఫాలో కుప్పకూలిపోయారు. స్పృహ తప్పిపోయిందని భావించిన శ్రీనివాసరావు ఆమె ముఖంపై నీళ్లు చల్లి లేపేందుకు యత్నించారు. ఎంతకీ లేపకపోవడంతో అనుమానం వచ్చి డాక్టర్​ను పిలిచి పరీక్ష చేయించారు. గుండెపోటుతో ఉషారాణి మృతి చెందినట్లు డాక్టర్ నిర్ధారించారు.

కూలీలను ఢీ కొట్టిన రైలు - బాధిత కుటుంబాలను ఆదుకోవాలని తోటి కూలీల డిమాండ్‌

నిమిషాల వ్యవధిలో భార్య, కుమార్తె మృతి చెందడంతో శ్రీనివాసరావు కన్నీరు మున్నీరు అయ్యారు. ఆయన్ను సముదాయించడం ఎవరి వల్లా కాలేదు. ఈ హృదయ విదారక సంఘటనను చూసి స్థానికులు సైతం కన్నీటిపర్యంతమయ్యారు. కొద్ది నిమిషాల వ్యవధిలోనే తల్లి, కుమార్తె మరణించడంతో దేవరాపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఓవైపు అప్పులు - మరోవైపు కుమార్తె కాపురంలో సమస్యలు - పురుగు మందు తాగి కుటుంబం ఆత్మహత్యాయత్నం

Last Updated :Mar 13, 2024, 4:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.