ETV Bharat / state

ఒడిశా నుంచి హైదరాబాద్​కు గంజాయి సరఫరా - మాటువేసి పట్టుకున్న పోలీసులు - Ganja Supplier Arrested in Hyd

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 21, 2024, 12:47 PM IST

Ganja Seller Arrest in hyderabad
Ganja Seller Arrest

Ganja Seller Arrested in Hyderabad : ఒడిశాలో కిలో గంజాయి రూ.5 వేలకు కొనుగోలు చేసి, హైదరాబాద్​లో రూ.15 వేలకు విక్రయిస్తున్న ఓ నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం రాత్రి హైదరాబాద్​లోని లింగంపల్లి రైల్వేస్టేషన్​లో మాటువేసి అతడిని పట్టుకున్నారు. నిందితుడి నుంచి 10 కిలోల మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.

ఒడిశా నుంచి హైదరాబాద్​కు గంజాయి సరఫరా - మాటువేసి పట్టుకున్న పోలీసులు

Ganja Seller Arrested in Hyderabad : రాష్ట్రంలో గంజాయి క్రయవిక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా, వాటి సరఫరా మాత్రం ఆగడం లేదు. ఇతర రాష్ట్రాలకు చెందిన నిందితులు వివిధ మార్గాల ద్వారా మత్తు పదార్థాలను హైదరాబాద్​కు చేరుస్తూ, తరచుగా పట్టుబడుతూనే ఉన్నారు. అయినప్పటికీ క్షేత్రస్థాయి పరిస్థితుల్లో మాత్రం ఎలాంటి మార్పు కనిపించడం లేదు. ఇటీవల కాలంలో గంజాయి వంటి మత్తు పదార్థాల రవాణా మరింత ఎక్కువైంది. నగరంలోని సాఫ్ట్​వేర్​ ఇంజినీర్లు, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని నిందితులు సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్​లో గంజాయి డెలివరీ ఇవ్వడానికి వచ్చిన ఒడిశాకు చెందిన ఓ నిందితుడిని హైదరాబాద్​ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.

వినియోగదారుడి నుంచి సరఫరాదారుడిగా : ఒడిశా నుంచి హైదరాబాద్​కు గంజాయి రవాణా చేస్తున్న రాహుల్ బైద్యా అనే నిందితుడిని ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. రైలులో గంజాయిని తీసుకొచ్చి, లింగంపల్లి రైల్వే స్టేషన్ నుంచి బయటకు వస్తున్న రాహుల్​ను మాటు వేసి రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్న పోలీసులు, అతడి నుంచి 10 కిలోల గంజాయి, ఓ సెల్​ఫోన్​ స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాలోని మల్కాన్​గిరికి చెందిన రాహుల్ గంజాయి, మత్తు పదార్థాలకు అలవాటు పడ్డాడని పోలీసులు వెల్లడించారు. క్రమంగా వినియోగదారుడి నుంచి సరఫరాదారుడిగా మారాడని వివరించారు.

నానక్​రామ్​గూడ అడ్డాగా నీతూబాయి గాంజా దందా - పోలీస్ డెకాయ్‌ ఆపరేషన్‌లో బహిర్గతం

మాటు వేసి : ఒడిశాకు చెందిన జగన్నాథ్​ బిస్వాస్ అనే వ్యక్తి నుంచి గంజాయి కొనుగోలు చేసి, హైదరాబాద్​లోని విక్రమ్ అలియాస్ వివేక్​ అనే వ్యక్తికి విక్రయిస్తున్నట్లు తమ విచారణలో తేలిందని పోలీసులు పేర్కొన్నారు. జగన్నాథ్ వద్ద కిలో రూ.5 వేలకు కొంటున్న రాహుల్‌, హైదరాబాద్​లో రూ.15 వేలకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఇదే క్రమంలో బుధవారం రాత్రి హైదరాబాద్​లో గంజాయి డెలివరీ చేయడానికి వచ్చిన రాహుల్​ను లింగంపల్లి రైల్వే స్టేషన్ నుంచి బయటకు వస్తున్న సమయంలో విశ్వసనీయ సమాచారం మేరకు అప్పటికే అక్కడ మాటు వేసిన రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ టాస్క్​ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. రాహుల్​కు గంజాయి సరఫరా చేస్తున్న జగన్నాథ్, రాహుల్​ నుంచి కొనుగోలు చేస్తున్న హైదరాబాద్​కు చెందిన వివేక్​లు పరారీలో ఉన్నట్లు వివరించారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు స్పష్టం చేశారు.

శివార్లలో గుప్పుమంటున్న గంజాయి - పొలంలోనే సాగు - చివరికి పోలీసులకు చిక్కి

కిరాణా దుకాణాల్లో గంజాయి చాక్లెట్లు - ముఠాల ఆట కట్టించిన పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.