ETV Bharat / state

రాష్ట్రంలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్‌ - బ్యాలెట్‌ బాక్సుల్లో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్యం - EVM Moved to Strong Room

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 14, 2024, 10:53 AM IST

EVMs Moved to Strong Room after Polling in AP : రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్​ ముగిసిన అనంతరం ఈవీఎంలు స్ట్రాంగ్​ రూమ్​కు తరిలించేందుకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. కొన్ని చోట్ల పోలింగ్​ అర్థరాత్రి దాటినా ఈవీఎంలు స్ట్రాంగ్​ రూమ్​కు తీసుకునేలా సిబ్బందిని అందుబాటులో ఉంచారు. స్ట్రాంగ్​ రూం వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.

EVMs at Strong Room
EVMs at Strong Room (ETV Bharat)

EVMs Moved to Strong Room After Polling in AP : ఎన్నికల్లో ఓ ఘట్టం ముగిసింది. రాష్ట్రంలో ఓటింగ్​ ప్రశాంతంగా ముగిసింది. ఇక ఓట్ల లెక్కింపు మిగిలి ఉంది. జూన్​ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. అప్పటివరకు ఈవీఎంలలో నిక్షిప్తమైన అభ్యర్థుల భవిష్యత్​ను కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉంది. దీంతో ఈవీఎంలను స్ట్రాంగ్​రూమ్​లకు తరలించారు. అన్ని స్ట్రాంగ్​రూమ్​ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

రాష్ట్రంలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్‌ - బ్యాలెట్‌ బాక్సుల్లో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్యం (ETV Bharat)

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం సమీపంలోని బిట్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌ను జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పరిశీలించారు. సోమవారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఎన్నికల ప్రక్రియ కొనసాగింది. పోలింగ్ ముగిసాక ఈవీఎంలను పోలీసుల భద్రత మధ్య స్ట్రాంగ్‌ రూమ్స్‌కు తరలించారు. మడకశిర,పెనుగొండ,కదిరి, హిందూపురం అసెంబ్లీ ,పార్లమెంట్‌కు సంబంధించిన ఈవీఎంలకు వివిధ కౌంటర్లు ఏర్పాటు చేసి అందులో భద్రపరిచారు.

Guntur District : గుంటూరు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో చిన్నపాటి ఘటనలు మినహా ప్రశాంతంగా పోలింగ్‌ ముగిసింది. పోలింగ్ ముగిసిన తర్వాత ఈవీఎం మిషన్లను ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూంకు తరలించారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో పలు చోట్ల ఈవీఎంల మొరాయింపుతో అర్ధరాత్రి వరకు పోలింగ్ కొనసాగింది. పోలింగ్ ముగిసిన వెంటనే ఈవీఎం మిషన్లను జేఎన్టీయూ స్ట్రాంగ్‌ రూంలో భద్రపరిచారు. పోలింగ్ ఆలస్యం అయిన వాటి కోసం అర్ధరాత్రి దాటినా ఈవీఎంలు తీసుకునేలా సిబ్బందిని అందుబాటులో ఉంచారు. స్ట్రాంగ్‌ రూం వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు

కోస్తా, ఉత్తరాంధ్రలో రణరంగం సృష్టించిన వైఎస్సార్సీపీ నేతలు - టీడీపీ కార్యకర్తలపై రాళ్లు, కర్రలతో దాడులు - YSRCP Attacks Kosta

West Godavari : తూర్పుగోదావరి జిల్లాలో పోలింగ్​ ముగిసిన తర్వాత ఈవీఎంలను రాజానగరం నన్నయ్య యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్​ రూంకు అధికారులు తరలించారు. ఆయా నియోజక వర్గాల నుంచి సెక్టార్ వారీగా పొలింగ్ సిబ్బంది నిర్ణీత పత్రాలు ఆర్వో పరిశీలన అనంతరం సంబంధింత అధికారులకు అందజేయడం జరిగింది. జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత నన్నయ్య యూనివర్సిటీకి చేరుకుని అసెంబ్లీ, పార్లమెంట్​కు నియోజకవర్గాలు నుంచి వస్తున్న ఈవీఎంలను వివిధ కౌంటర్లులో ఏర్పాటు చేసే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకున్నారు.

సీమలో వైసీపీ దాదాగిరి - ప్రతిపక్షాలపై దాడులు - Elections In Rayalaseema

Visakha District : విశాఖ జిల్లాలో పోలింగ్ ప్రారంభానికి గంట ముందు నుంచే పెద్ద సంఖ్యలో ఓటర్లు అన్ని కేంద్రాల్లో బారులు తీరారు. సోమవారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి వర్షంలోనూ పోలింగ్​ ప్రక్రియ సజావుగా సాగింది. కొన్నిచోట్ల ఓటర్లు క్యూలైన్ లో నిలబడి తమ వంతు వచ్చే వరకు ఓటు వేసి మరి అక్కడి నుంచి కదిలారు. పోలింగ్ పూర్తయిన తర్వాత అధికారులు ఈవీఎంలు రాత్రికి రాత్రే స్ట్రాంగ్​ రూంల్లో భద్రపరిచారు. కొన్ని చోట్ల ఈ ప్రక్రియ మంగళవారం ఉదయం వరకు కొనసాగింది.

పోలింగ్ సరళి పట్ల చంద్రబాబు హర్షం - నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు - Chandrababu Naidu On Voter Turnout

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.