ETV Bharat / state

విజయవాడ ఇంజినీరింగ్​ విద్యార్థుల ఈ-బైక్​ - ఒక్క యూనిట్​తో 120 కిలోమీటర్లు - Engineering Students Electric Bike

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 22, 2024, 7:21 PM IST

engineering_students_develop_electric_bike_in_low_price_at_vijayawada
engineering_students_develop_electric_bike_in_low_price_at_vijayawada

Engineering Students Develop Electric Bike in Low Price At Vijayawada : ప్రస్తుత సమాజంలో ద్విచక్ర వాహనం మానవ జీవితంలో భాగమైపోయింది. బైక్‌ లేనిదే గడప దాటలేని పరిస్థితి నెలకొంది. కూరగాయలు తేవడానికి, కిరాణం షాపుకు వెళ్లడానికి ఇలా చిన్న చిన్న అవసరాల కూడా బండి లేనిదే కాలు కదపడం లేదు. అయితే, పెరుగుతున్న పెట్రోల్‌ రేట్ల దృష్ట్యా చాలామంది విద్యుత్‌ వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. దానిని ఆసరాగా చేసుకున్న ఆ యువకులు కేవలం 35 వేలకే విద్యుత్‌ వాహనాన్ని తయారు చేశారు. మరి, ఆ వాహనానికి సంబంధించిన విశేషాలు ఏమిటంటే !

విజయవాడ ఇంజినీరింగ్​ విద్యార్థుల ఈ-బైక్​ - ఒక్క యూనిట్​తో 120 కిలోమీటర్లు

Engineering Students Develop Electric Bike in Low Price At Vijayawada : ప్రస్తుత మార్కెట్‌లో విద్యుత్‌ వాహనాలకు ఆదరణ పెరుగుతోంది. పెట్రోల్‌ రేట్ల దృష్ట్యా చాలామంది ఈ వెహికిల్స్‌ని కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. కానీ, వాటికి దాదాపు లక్ష రూపాయలు వెచ్చించడం అవసరమా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అందుకోసమనీ కేవలం రూ. 35 వేలకే ఎలక్ట్రిక్‌ బైక్‌ను తయారు చేశారు విజయవాడలోని కానూరు సిద్ధార్థ ఇంజినీరింగ్‌ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న యువకులు. అవినాష్‌, మురళీ కృష్ణరెడ్డి రఘువరన్‌ B.Tech సినిమాలో హీరో ధనుష్‌ మాదిరి బైక్‌ను ఆవిష్కరించారు. సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా చిట్టి ఎలక్ట్రిక్‌ (Chitti Electric) పేరుతో చవకైన విద్యుత్‌ వాహనాన్ని తయారు చేశారు.

మార్కెట్‌లో దొరికే విద్యుత్‌ వాహనాలకు సమానంగా చిట్టి ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ని తయారు చేశామని ఈ యువకులు అంటున్నారు. కేవలం 2 గంటల్లో పూర్తిగా ఛార్జ్‌ అయ్యేలా రూపొందించామని వివరిస్తున్నారు. ఆఫ్‌ యూనిట్‌ ఛార్జింగ్‌ పెడితే దాదాపు 60 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చని చెబుతున్నారు ఎలక్ట్రిక్ బైక్‌ ఆవిష్కర్తలు. చిట్టి ఎలక్ట్రిక్‌ బైక్‌ గంటకు 25 కిలోమీటర్ల వేగంతో నడిచేలా తయారు చేశామని ఈ యువకులు చెబుతున్నారు. తక్కువ ఖర్చుతో GPS వ్యవస్థతో ఏర్పాటు చేశామని, దాని ద్వారా ఏ దారిలో ఎంత దూరం ప్రయాణించామనే విషయాలను బైక్‌ (Bike) యజమానికి తెలియజేస్తుందని వివరిస్తున్నారు. కేవలం 35 వేలకే చిట్టి ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ని అందుబాటులోకి తీసుకు వస్తున్నామని చెబుతున్నారు.

పదో తరగతి విద్యార్థి.. ఎలక్ట్రిక్​ బైక్​ను సృష్టించాడు!

'చిట్టి విద్యుత్‌ వాహనాన్ని తయారు చేయడానికి సుమారు 2 నెలల సమయం పట్టింది ఎలక్ట్రిక్ వెహికిల్ కావడం వల్ల రిజిస్ట్రేషన్, లైసెన్స్‌ వంటివి అవసరం లేదు. రైతులకు, డెలివరీ బాయ్స్‌కు ఉపయోగపడే విధంగా మరిన్ని ఫీచర్స్‌ని అందుబాటులోకి తేస్తాం. దాంతోపాటు గంటకు 100 కిలోమీటర్లు ప్రయాణించేలా నూతన సాంకేతికతను జోడించే ప్రయత్నంలో ఉన్నాం. మరో నాలుగు నెలల్లో దీన్ని మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దుతాం.' -అవినాష్‌, మురళీకృష్ణ, ఎలక్ట్రిక్ బైక్‌ ఆవిష్కర్తలు

వ్యర్థాలతో విద్యుత్​ బైక్​- బాలుడి ఆవిష్కరణ

'విద్యార్థులలోని నైపుణ్యాలను ఎప్పుడూ ప్రోత్సహిస్తాం. దానివల్ల విద్యార్థులే స్వయంగా ఉపాధిని సృష్టించుకుంటారు. భవిష్యత్తులో భారత దేశం ఆర్థికంగా ఎదగాలంటే స్టార్టప్‌ హబ్​ అభివృద్ధి జరగాలి. దానికోసం విద్యార్థులు, ఉపాద్యాయులు ఉమ్మడిగా సహకారం అందించుకోవడాన్ని నేను అనుసరిస్తాను.' - రత్న ప్రసాద్, సిద్ధార్థ ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపల్

6 సీట్ల ఈ-బైక్.. ఒక్కసారి ఛార్జింగ్​తో 150కి.మీ.. ధర ఎంతంటే..?

Electric Bike By Engineering Students Vijayawada : విద్యుత్‌ వాహనాలకు ధీటుగా సామాన్యులకు ఉపయోగపడే విధంగా చిట్టి ఎలక్ట్రిక్ వెహికిల్‌ని మార్కెట్‌లోకి అందుబాటులోకి తెవడానికి ఈ యువకులు ప్రయత్నిస్తున్నారు. ఇటువంటి ఇన్నోవేషన్స్‌ తమలో నైపుణ్యాలను మరింత బలోపేతం చేస్తాయని చెబుతున్నారు.

అదిరే ఫీచర్లతో సూపర్​ ఈ- బైక్​ 'ప్రాణ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.