ETV Bharat / state

విజృంభిస్తున్న విష జ్వరాలు - ఉక్కిరి బిక్కిరవుతున్న గ్రామస్థులు - Dengue cases are rising

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 11, 2024, 7:02 PM IST

Rising Dengue Fever Cases : ఏలూరు జిల్లా ఎర్రంపల్లి గ్రామంలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. గత 15 రోజుల క్రితం ఓ వృద్ధురాలు టైఫాయిడ్ జ్వరంతో మృతి చెందింది. తాజాగా మరి కొంతమంది సైతం డెంగ్యూ లక్షణాలతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న జిల్లా వైద్య అధికారులు ఎర్రంపల్లిలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.

Rising Dengue Fever Cases
Rising Dengue Fever Cases

Rising Dengue Fever Cases: ఆ గ్రామంలో 15 రోజుల క్రితం ఓ వృద్దురాలు టైఫాయిడ్ జ్వరంతో చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే, గ్రామస్థులంతా వృద్దురాలి మరణాన్ని తెలికగా తీసుకున్నారు. పదిహేను రోజులలో గ్రామంలో అనేక మంది డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్​ జ్వరాలతో ఇబ్బందులు పడుతున్న ఘటన ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఎర్రంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్థుల ఫిర్యాదు మేరకు జిల్లా అధికారులు స్పందించారు. గ్రామంలో విష జ్వరాలకు గల కారణాలను అన్వేషించడంతో పాటుగా, వైద్య శిబింరం ఏర్పాటు చేశారు.

ఏలూరు జిల్లా ఎర్రంపల్లి గ్రామంలో విష జ్వరాలు గ్రామస్థులను కలవరపెడుతున్నాయి. గత కొద్ది రోజులుగా గ్రాస్థుల్లో ఒక్కొక్కరుగా విష జ్వరాల భారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో 15 రోజుల క్రితం ఎర్రంపల్లి గ్రామానికి చెందిన గోగం నాగేశ్వరమ్మ టైఫాయిడ్ జ్వరంతో మృతి చెందారు. గ్రామంలో జ్వరంతో ఓ వ్యక్తి మృతి చెందినప్పటికీ నిర్లక్ష్యం వహిస్తూ గ్రామంలోని ఆర్ఎంపీని సంప్రదించి మందులు వాడుతూ వస్తున్నారు. అయితే, గత 10 రోజులుగా అదే గ్రామానికి చెందిన లక్కపాము ప్రియాంక (21), నాగిరెడ్డి పద్మావతి (41), తక్షీల్ (10) ముగ్గురికి జ్వరం వచ్చింది. ఎంతకీ జ్వరం తగ్గడం లేదు, పైగా ఇతరులు సైతం జ్వరం భారిన పడుతున్నారు.

ఈ నేపథ్యంలో వారంతా ప్రైవేట్ ఆసుత్రుల్లో వైద్య పరీక్షల్లో చేయించుకున్నారు. ఆ ముగ్గురికి డెంగ్యూ జ్వరం సోకినట్లు నిర్ధారణ అయింది. నాగిరెడ్డి పద్మావతి, తక్షీల్ ఏలూరు ప్రైవేటు ఆసుపత్రిలొ చికిత్స పొందుతున్నారు. లక్కపాము ప్రియాంక గ్రామంలోనే ఆర్ఎంపీ వైద్యుడి వద్దే చికిత్స పొందుతున్నారు.

విజృంభిస్తున్న విష జ్వరాలు - ఉక్కిరి బిక్కిరవుతున్న గ్రామస్థులు

డెంగ్యూ జ్వరాలపై మండలంలోని వైద్య అధికారులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఏలూరు జిల్లా డీఎంఅండ్ హెచ్ఓ డాక్టర్ శర్మిష్ఠా గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. గ్రామంలో జ్వరం లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికీ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎర్రంపల్లి గ్రామంలో డెంగ్యూ జ్వరాల తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు గుర్తించామన్నారు.

ఒకేరోజు 13వేల మందికి 'వింత జ్వరం'.. భయంతో ఆస్పత్రికి పరుగు.. ప్రభుత్వం అలర్ట్

ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ, తమ గ్రామంలో పారిశుద్ధ్యం నిర్వహణ అధ్వానంగా తయారైందని ఆరోపించారు. దీంతో తరచూ రోగాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గత 15 రోజుల కిందట ఇదే గ్రామానికి చెందిన, గోగం నాగేశ్వరమ్మ టైఫాయిడ్ జ్వరంతో మృతిచెందినట్లు తెలిపారు. గ్రామంలో మరికొంత మంది జ్వరాలతో బాధపడుతున్నారని వెల్లడించారు. అధికారులు స్పందించి సరైన వైద్య సేవలు కల్పించాలని కోరతున్నారు. పారిశుద్ధ్యం నిర్వహణ సరిగా జరిగేట్లు చూడాలని వెల్లడించారు.

Young Man Died With Dengue In Uravakonda : విజృంభిస్తున్న విషజ్వరాలు.. 'డెంగీ' కాటుకు మరో యువకుడు బలి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.