ETV Bharat / sports

వికెట్​ కీపర్​గా కేఎల్​ రాహుల్​ ఔట్​- ఆంధ్ర కుర్రోడికి ఛాన్స్​ దక్కేనా?

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 23, 2024, 6:45 PM IST

KL Rahul Role In Team Against England Test Series In Hyderabad
KL Rahul Role In Team

KL Rahul Role In Team : ఇంగ్లాండ్​తో టెస్టు సిరీస్​కు సమయం సమీపిస్తున్న వేళ టీమ్​లో యువ ఆటగాడు కేఎల్​ రాహుల్​ రోల్​పై క్లారిటీ ఇచ్చారు టీమ్​ఇండియా హెడ్​ కోచ్​ రాహుల్​ ద్రవిడ్​. ఇకపై రాహుల్​ను ఆ బాధ్యతల నుంచి పక్కకు పెడుతున్నట్లు తెలిపారు. అతడి స్థానంలో మిగతా ఇద్దరు యంగ్​ ప్లేయర్స్​ను అవకాశం ఇవ్వనున్నట్లు వివరించారు.

KL Rahul Role In Team : జనవరి 25 నుంచి ఉప్పల్​ స్టేడియంలో జరగనున్న టెస్ట్​ మ్యాచ్​కు భారత్​, ఇంగ్లాండ్ జట్లు సన్నద్ధమవుతున్నాయి​. ఈ నేపథ్యంలో ఇప్పటికే మొదటి రెండు మ్యాచ్​లకు జట్టును ప్రకటించిన టీమ్​ఇండియా- ఇందులో కీలక ఆటగాడిగా ఉన్న కేఎల్​ రాహుల్​ స్థానంపై వివరణ ఇచ్చింది. ఈ సిరీస్​లో రాహుల్​ను వికెట్​ కీపింగ్​ బాధ్యతల నుంచి పక్కకు పెడుతున్నట్లు జట్టు కోచ్​ రాహుల్​ ద్రవిడ్ చెప్పారు. రాహుల్​ స్థానంలో అందుబాటులో ఉన్న కేఎస్​ భరత్​, ధృవ్ జురెల్​కు అవకాశం ఇవ్వనున్నట్లు తెలిపారు. పరిస్థితుల ఆధారంగా వీరిద్దరిలో ఒకరికి వికెట్​ కీపింగ్​ అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం టీమ్ ప్లేయర్ల ప్రాక్టీస్​ అనంతరం నిర్వహించిన ప్రీ-మ్యాచ్​ ప్రెస్​మీట్​లో వెల్లడించారు. ఇక ఈ ప్రకటనతో స్పెషలిస్ట్​గా బ్యాటర్​గా టీమ్​లో కొనసాగనున్నాడు కేఎల్​.

"స్వదేశంలో ఇంగ్లాండ్​తో జరిగే టెస్ట్​ సిరీస్​లో కేఎల్​ రాహుల్​ వికెట్ కీపింగ్​ బాధ్యతలు నిర్వర్తించడు. ఆటగాళ్ల ఎంపిక విషయంలో మేము ఇప్పటికే ఫుల్​ క్లారిటీతో ఉన్నాం. రాహుల్​ స్థానంలో మరో ఇద్దరు ప్లేయర్స్​ను సెలెక్ట్​ చేశాం. వీరిలో ఒకరు మొదటి రెండు టెస్టులకు ఈ బాధ్యతలను నిర్వర్తిస్తారు."
- రాహుల్​ ద్రవిడ్, హెడ్ కోచ్​​

'కేఎల్​ అద్భుతంగా ఆడాడు- కానీ'
'డిసెంబర్​-జనవరిలో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు మ్యాచ్​ల టెస్టు సిరీస్​లో కేఎల్​ రాహుల్​ అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించాడు. ఈ సిరీస్​ డ్రా కావడంలో ఇతడిది కీలక పాత్ర. ఈ 5 టెస్టుల సుదీర్ఘ సిరీస్​తో పాటు నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అతడ్ని(కేఎల్​ రాహుల్​ను) వికెట్​ కీపింగ్​ బాధ్యతలకు దూరంగా ఉంచాలని సెలక్టర్లు నిర్ణయించారు' అని రాహుల్​ అన్నారు.

ఆంధ్ర కుర్రోడికే ఎక్కువ అవకాశాలు!
ఆంధ్ర యువ ఆటగాడు కేఎస్ భరత్​ ఇప్పటికే టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు మొత్తం 5 టెస్టు మ్యాచులు ఆడాడు. అంతేకాకుండా 2023లో ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్​-గావస్కర్​ ట్రోఫీ జట్టు​లో కూడా ఇతడు భాగమయ్యాడు. మరోవైపు ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన యంగ్​ ప్లేయర్​​ ధృవ్ జురెల్ ఇంకా అంతర్జాతీయ క్రెకెట్​లో ఇంకా ఎంట్రీ ఇవ్వనేలేదు. ఇద్దరి అనుభవాలను పరిశీలిస్తే క్రికెట్​లో ఫస్ట్​క్లాస్​ ఎక్స్​పీరియన్స్​ కలిగిన కేఎస్​ భరత్​కే ఇంగ్లాండ్​ సిరీస్​లో వికెట్​ కీపర్​గా ఛాన్స్​ దక్కే అవకాశం ఉంది. రిస్క్​ తీసుకొని జురెల్​కు ఆ బాధ్యతలు అప్పగిస్తే మాత్రం అతడికి ఇదే తొలి టెస్ట్​ మ్యాచ్​ కానుంది.

టీమ్ఇండియా జెర్సీలో విరాట్​ - అయోధ్య సన్నిధిలో సందడి !

'ఆ ట్రిక్​తో ​నన్నేం చేయలేరు - నేను మీకు అలాగే బదులిస్తాను '

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.