ETV Bharat / sports

భారత్ x ఇంగ్లాండ్ : స్వదేశంలో టీమ్ఇండియా భారీ విజయాలు

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 29, 2024, 5:27 PM IST

Ind Vs Eng Top 5 Test Moments
Ind Vs Eng Top 5 Test Moments

Ind Vs Eng Top 5 Test Moments: టీమ్​ఇండియా మూడు ఫార్మాట్​లలో కొంతకాలంగా సక్సెస్​ఫుల్​గా దూసుకుపోతోంది. ప్లేయర్లలోనూ టన్నుల కొద్దీ కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది. ఎలాంటి జట్టునైనా చీల్చిచెండాడుతోంది. ఈ నేపథ్యంలో భారత్ పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్​కు కూడా ఓటమి మిగిల్చింది. అయితే భారత్​ సొంతగడ్డపై ఇంగ్లాండ్​ను చిత్తుగా ఓడించిన సందర్భాలు మీకు తెలుసా?

Ind Vs Eng Top 5 Test Moments: ఇంగ్లాండ్​తో జరుగుతున్న టెస్టు సిరీస్​ను భారత్ మరో మ్యాచ్ మిగిలుండగానే గెలుచుకుంది. ఈ క్రమంలో భారత్ స్వదేశంలో చివరి 16 టెస్టు సిరీస్‌లను గెలుచుకొని జైత్రయాత్ర కొనసాగిస్తుంది. అయితే బజ్​బాల్ వ్యూహాన్ని నమ్ముకొని భారత్ పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్​పై​టీమ్ఇండియా పూర్తి ఆధిపత్యం చలాయిస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుత సిరీస్​లో రాజ్​కోట్​ టెస్టులో టీమ్ఇండియా 434 పరుగుల భారీ తేడాతో నెగ్గి సంచలనం సృష్టించింది. పరుగుల పరంగా టెస్టుల్లో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసి భారత్ రికార్డ్ కొట్టింది. అయితే గతంలోనూ సొంతగడ్డపై టీమ్ఇండియా ఇంగ్లాండ్​ను చిత్తు చిత్తుగా ఓడించిన సందర్భాలు ఉన్నాయి. అందులో టాప్ మూమెంట్స్​ ఏంటో ఇప్పుడు చూద్దాం.

1. మొహాలి (2001): తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్​ 238 పరుగులకే ఆలౌటైంది. టీమ్ఇండియా ఆల్​రౌండర్​ హర్భజన్ సింగ్ ఐదు వికెట్ల ప్రదర్శనతో మెరిశాడు. ఆ తర్వాత దీప్ దాస్‌గుప్తా (100), సచిన్ తెందూల్కర్ (88), రాహుల్ ద్రవిడ్ (86) రాణించడం వల్ల టీమ్​ఇెండియా 231 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో అనిల్ కుంబ్లే బౌలింగ్​తో మాయాజలం చేశాడు. ఏకంగా 6 వికెట్లు నేలకూల్చి ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు. ఫలితంగా రెండో ఇన్నింగ్స్​లో ఇంగ్లాండ్ 235 పరుగులకే ఆలౌటై భారత్​కు కేవలం 5 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ అతి స్వల్ప లక్ష్యాన్ని ఛేదించిన భారత్ ఘన విజయాన్ని నమోదు చేసింది.

2. చెన్నై (2008): అప్పటి ఇంగ్లాండ్ కెప్టెన్ అతి విశ్వాసంతో రెండో ఇన్నింగ్స్​ను 311-9 వద్ద డిక్లేర్డ్​ చేశాడు. ఇక తొలి ఇన్నింగ్స్​లో 75 పరుగుల ఆధిక్యం సాధించిన ఇంగ్లాండ్​ 387 రన్స్​ టార్గెట్​ను భారత్ ముందుంచింది. ఈ క్రమంలో టీమ్ఇండియా ధాటిగా ఆడింది. దిగ్గజ ప్లేయర్ సచిన్ తెందూల్కర్ (103 నాటౌట్) శతకానికి తోడు, వీరేంద్ర సెహ్వాగ్ (83), యువరాజ్ సింగ్ (85 నాటౌట్), గౌతమ్ గంభీర్ (66) సమష్టిగా రాణించి భారత్​ విజయంలో కీలక పాత్ర పోషించారు.

3. అహ్మదాబాద్ (2012): ఛెతేశ్వర్ పుజారా (206) డబుల్ సెంచరీకి తోడు వీరేంద్ర సెహ్వాగ్ (117), యువరాజ్ సింగ్ (74) భారీ ఇన్నింగ్స్​తో భారత్ తొలి ఇన్నింగ్స్​లో 521-8 వద్ద డిక్లేర్డ్ చేసింది. భారత్​ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా అద్భుత బౌలింగ్​తో తొలి ఇన్నింగ్స్​లో 5 వికెట్లు దక్కించుకున్నాడు. ఫలితంగా ఇంగ్లాండ్ 191 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్ ప్రత్యర్థిని ఫాలోఆన్​లోకి నెట్టింది. రెండో ఇన్నింగ్స్​లో ఇంగ్లాండ్ 406 పరుగులు చేసి, భారత్​కు 77 పరుగుల టార్గెట్​ను నిర్దేశించింది. ఈ స్వల్ప టార్గెట్​ను టీమ్ఇండియా 1 వికెట్ కోల్పోయి ఛేదించింది.

4. చెన్నై (2016): తొలి ఇన్నింగ్స్​లో ఇంగ్లాండ్ 477 పరుగులు చేసి ఫుల్ కాన్ఫిడెన్స్​గా ఉంది. అయితే కరుణ్ నాయర్ (303*) ట్రిపుల్ సెంచరీకి తోడు కేఎల్ రాహుల్ (199), పార్థివ్ పటేల్ (71), రవిచంద్రన్ అశ్విన్ (67), రవీంద్ర జడేజా (51) రాణించడం వల్ల భారత్​ టెస్టు చరిత్రలో అత్యధిక స్కోర్ (759/7 d) నమోదు చేసింది. రెండో ఇన్నింగ్స్​లో తేలిపోయిన ఇంగ్లాండ్ కేవలం 207 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్ ఇన్నింగ్స్, 75 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది.

5. గుజరాత్(2024): రాజ్​కోట్​లో ఇంగ్లాండ్​తో జరిగిన టెస్టులో భారత్​ 434 పరుగుల తేడాతో గెలిచి రికార్డు క్రియేట్ చేసింది. టెస్టు క్రికెట్ చరిత్రలోనే పరుగుల పరంగా భారత జట్టుకు ఇదే అత్యంత పెద్ద విజయం. అద్భుతమైన ఆటతీరుతో రోహిత్ శర్మ సేన ఈ గ్రాండ్ విక్టరీని తమ ఖాతాలో వేసుకుంది.

యశస్వి జైశ్వాల్‌ సరికొత్త చరిత్ర - 92 ఏళ్లలో ఇదే తొలిసారి!

జడ్డూ దెబ్బకు ఇంగ్లాండ్ హడల్​ - 353 పరుగులకు ఆలౌట్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.