ETV Bharat / politics

తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ వేడుకలు - TDP 42nd Foundation Day

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 29, 2024, 8:11 PM IST

TDP 42nd Foundation Day Celebrations
TDP 42nd Foundation Day Celebrations

TDP 42nd Foundation Day Celebrations: తెలుగువారి ఆత్మగౌరవం అనే నినాదంతో పురుడు పోసుకుని ఆరు నెలల్లోనే అధికారం చేపట్టిన తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ వేడుకలను తెలుగు ప్రజలు ఘనంగా నిర్వహించారు. అణ‌గారిన‌ వ‌ర్గాల‌కు అండ‌గా నిలిచింది ప‌సుపు జెండానే అని లోకేశ్ అన్నారు. నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం జెండాలను ఎగురవేసి కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేశారు.

TDP 42nd Foundation Day Celebrations : తెలుగువారి ఆత్మగౌరవం అనే నినాదంతో పురుడు పోసుకుని రు నెలల్లోనే అధికారం చేపట్టిన తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ వేడుకలను తెలుగు ప్రజలు ఘనంగా నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం జెండాలను ఎగురవేసి కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేశారు. 4 దశాబ్దాలుగా బడుగు, బలహీన వర్గాలకు పార్టీ అండగా నిలిచిందని నాయకులు తెలిపారు. ఓటర్లుగా మిగిలిపోయిన అనేక సామాజిక తరగతులను అధికారానికి చేరువ చేసిందన్నారు.

అణ‌గారిన‌ వ‌ర్గాల‌కు అండ‌గా నిలిచింది ప‌సుపు జెండానే అని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. ఉండవల్లిలోని నివాసంలో పార్టీ శ్రేణులతో కలసి భువనేశ్వరి కేక్‌ కట్‌ చేశారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేశారు. 42 ఏళ్లుగా పసుపు జెండా భుజాన మోస్తున్న కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి పెట్టనికోటని టీడీపీ నేత కంభంపాటి రామ్మోహనరావు కొనియాడారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో పొలిట్‌బ్యూరో సభ్యులు పార్టీ జెండాను ఎగురవేశారు. ఎన్టీఆర్ జిల్లాలో మైలవరం తెలుగుదేశం అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్‌ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో తెలుగుదేశం ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

42వ వసంతంలోకి టీడీపీ - పార్టీ శ్రేణులకు అభినందనలు తెలిపిన చంద్రబాబు - TDP Formation Day Celebrations

గుంటూరులోని జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌, ప్రత్తిపాడు ఎమ్మెల్యే అభ్యర్థి బూర్ల రామాంజనేయులు, గుంటూరు పశ్చిమ అభ్యర్థి మాధవి పాల్గొని కేక్‌ కట్‌ చేశారు. మంగళగిరి, బాపట్ల, చీరాలలోనూ వేడుకలు ఘనంగా జరిగాయి. మార్టూరులో నిర్వహించిన వేడుకల్లో పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, బాపట్ల తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి టి.కృష్ణప్రసాద్‌ పాల్గొన్నారు. ఒంగోలులో మాజీ ఎమ్మెల్యేలు దామచర్ల జనార్ధన్‌, గరటయ్య, ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి వేడుకల్లో పాల్గొన్నారు.

శ్రీకాకుళం జిల్లా పలాస తెలుగుదేశం కార్యాలయంలో మాజీ మంత్రి గౌతు శివాజీ ఆధ్వర్యంలో ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీడీపీ జెండాలను ఎగురవేసి నినాదాలు చేశారు. శ్రీకాకుళం, నరసన్నపేటలో వేడుకల్లో తెలుగుదేశం శ్రేణులు భారీగా పాల్గొన్నాయి. విజయనగరంలో అశోక్‌గజపతి రాజు పార్టీ జెండాను ఎగురవేశారు. ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతూ అభివృద్ధికి కృషి చేస్తున్న సీనియర్‌ నాయకులను సత్కరించారు. పార్వతీపురం, కురుపాం, అనకాపల్లి, తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు, పశ్చిమగోదావరి జిల్లా తణుకులో కేక్‌ కట్‌చేసి సంబరాలు చేశారు.

టీడీపీ అభ్యర్థుల ఫైనల్​ జాబితా విడుదల- ప్రచారంలో తమ్ముళ్ల దూకుడు - TDP Candidates Final List

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో పార్టీ నేతలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టారు. కడపలో భారీ కేక్ కట్ చేసి కార్యకర్తలకు, ప్రజలకు పంచిపెట్టారు. కర్నూలు సమీపంలోని మామిదాలపాడులో పార్టీ నేతలు స్వీట్లు పంచిపెట్టారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం, అన్నమయ్య జిల్లా రాజంపేట, తిరుపతి, నంద్యాలలో ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి.

హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో టీడీపీ ఆవిర్భావ వేడుకలను పార్టీ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నందమూరి రామకృష్ణ పార్టీ జెండాను ఎగురవేశారు. నల్గొండ, ఖమ్మం, మంచిర్యాల జిల్లాలోనూ తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి.

ఎన్టీఆర్ ప్రజా సేవ కోసం తపించినట్లే - చంద్రబాబు తపిస్తారు: భువనేశ్వరి - Bhuvaneswari Nijam Gelavali Yatra

42 వసంతాల తెలుగుదేశం - బడుగు, బలహీన వర్గాల పార్టీకి టీడీపీ నేతల శుభాకాంక్షలు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.