ETV Bharat / politics

హత్యా రాజకీయాలు చేస్తున్న జగన్​కు ఓటేయొద్దు: దస్తగిరి

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 19, 2024, 5:45 PM IST

pulivendula_jai_bhim_rao_bharat_party_candidate_dastagiri_fire_on_jagan
pulivendula_jai_bhim_rao_bharat_party_candidate_dastagiri_fire_on_jagan

Pulivendula Jai Bhim Rao Bharat Party Candidate Dastagiri Fire on Jagan : ముఖ్యమంత్రి జగన్ దళితులు, మైనార్టీలకు ఏం చేశారో చెప్పాలని పులివెందుల జై భీం రావు భారత్ పార్టీ అభ్యర్థి దస్తగిరి డిమాండ్ చేశారు. ఈ సారి జగన్​కు ఓటు వేస్తే మన గొంతు మనం కోసుకున్నట్టేనన్నారు. హత్యా రాజకీయాలు చేయించిన జగన్​కు ఓటు వేయొద్దని కోరారు.

Pulivendula Jai Bhim Rao Bharat Party Candidate Dastagiri Fire on Jagan : జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి దాకా దళిత బిడ్డలపై దాడులు జరిగాయని పులివెందుల జై భీం రావు భారత్ పార్టీ అభ్యర్థి దస్తగిరి ఆరోపించారు. వారి తరఫున పూర్తి స్థాయిలో పోరాటం చేస్తామని ఆయన తెలిపారు. జగన్ పాలన రాజుల పాలన పోయి రాక్షస పాలన వచ్చినట్టుగా ఉందని అన్నారు. వాళ్లు చేసిన అన్యాయాలు, అక్రమాలను మీడియా బయట పెడుతుందన్నారు. జగన్ పూర్తి స్థాయిలో అమాయక ప్రజలందరినీ మోసం చేసి మరోమారు గద్దె నెక్కాలని భావిస్తున్నారని అన్నారు.

సాక్ష్యాన్ని ఉపసంహరించుకుంటే రూ.20కోట్లు ఇస్తామన్నారు: దస్తగిరి

దళితులను కొట్టడం గొప్పతనమా అని దస్తగిరి నిలదీశారు. దళిత మహిళ (Dalit woman)ను రేప్ చేసి స్టేషన్ ముందు పడేసినా చర్యలు లేవని అన్నారు. రాష్ట్రంలో రాజారెడ్డి, జగన్ రాజ్యాంగం (Jagan Constitution) నడుస్తోందన్నారు. జగన్ మైనార్టీలకు తోఫా ఇస్తా అని చెప్పి ఇవ్వలేదని అన్నారు. దళిత నాయకుడి భూమిని వైఎస్సార్సీపీ వాళ్లు లాక్కుంటే తాను వెళ్తే ఆ విషయాన్ని దాచేసి తాను బెదిరింపులకు పాల్పడినట్లు పుకారు పుట్టించారని దస్తగిరి మండిపడ్డారు.

అవినాష్‌రెడ్డి బెయిల్‌పై బయట ఉండటం వల్లే దాడులు పెరిగాయి : దస్తగిరి

జగన్ దళిత బిడ్డలకు, మైనార్టీలకు ఏమి చేశారో చెప్పాలని దస్తగిరి డిమాండ్ చేశారు. ఈ సారి జగన్ కు ఓటు వేస్తే మన గొంతు మనం కోసుకున్నట్టేనన్నారు. తన తండ్రిపై జరిగిన దాడి వాస్తవమని అన్నారు. తాను జై భీం భారత్ పార్టీ (Jai Bheem Bharat Party) తరఫున పోటీ చేస్తున్నానని, అందుకే కేవలం రాజకీయం గురించే మాట్లాడుతానని దస్తగిరి స్పష్టం చేశారు.

ఎంపీ అవినాష్ బెయిల్ రద్దు చేయాలి - హైకోర్టులో దస్తగిరి పిటిషన్

వివేకానంద రెడ్డి హత్య గురించి ఇప్పుడు మాట్లాడనని తెలిపారు. హత్య రాజకీయాలు చేయించింది జగన్ గనుకే ఆయనకు ఓటు వేయొద్దని కోరారు. తాను అప్రూవర్ గా మారక పోయుంటే తనకు కూడా ఓటు అడిగే హక్కు లేదని అన్నారు. తాను చేసింది తప్పే అని స్వయంగా తానే ఒప్పుకొంటున్నానని, ఇప్పుడు మారిపోయానని చెప్తున్నానని అన్నారు. జగన్ వల్ల అక్కడి ప్రజలు మోసపోయారని, పులివెందుల నుంచి తాను పోటీ చేయడానికి కారణం అదేనని వివరించారు. అందుకే తాను పులివెందుల నుంచే జగన్ ను ఢీ కొట్టాలి అనుకుంటున్నానని అన్నారు. అక్కడి నుంచే పోటీలో నిలిచి గెలుస్తానని దస్తగిరి ధీమా వ్యక్తం చేశారు.

వివేకా హత్య కేసులో నిందితుడిని కాదు - సాక్షిని మాత్రమే: దస్తగిరి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.