ETV Bharat / politics

తెలంగాణ అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తాం : ప్రధాని మోదీ

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 4, 2024, 12:39 PM IST

Updated : Mar 4, 2024, 1:58 PM IST

PM Modi Adilabad Tour News
PM Modi Speech at Adilabad Meeting

PM Modi Speech at Adilabad Meeting Today 2024 : దేశంలోని అనేక రాష్ట్రాలు అభివృద్ధిలో దూసుకెళ్తున్నాయని, తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. పేదలు, దళితులు, ఆదివాసీల అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఈ క్రమంలోనే గత పదేళ్లలో పేదరికం నుంచి 25 కోట్ల మంది బయటపడ్డారని తెలిపారు.

తెలంగాణ అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తాం : ప్రధాని మోదీ

PM Modi Speech at Adilabad Meeting Today 2024 : దేశంలోని అనేక రాష్ట్రాలు అభివృద్ధిలో దూసుకెళ్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడి పదేళ్లు అయ్యిందని, రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందని స్పష్టం చేశారు. నేడు ఎన్టీపీసీ రెండో యూనిట్‌ ప్రారంభించామన్న ఆయన, ఈ రెండో యూనిట్ 800 మెగా వాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేస్తుందని వివరించారు. ఈ క్రమంలోనే పేదలు, దళితులు, ఆదివాసీల అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. గత పదేళ్లలో పేదరికం నుంచి 25 కోట్ల మంది బయటపడ్డారన్న ఆయన, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశాభివృద్ధి కోసం కృషి చేస్తుందని స్పష్టం చేశారు.

PM Modi Adilabad Tour News : ఆదిలాబాద్‌ సభలో రూ.7 వేల కోట్ల విలువైన పనులను ప్రధాని మోదీ ప్రారంభించారు. పలు అభివృద్ధి పనులను వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని, రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. 800 మెగావాట్ల రెండో దశ విద్యుత్‌ కేంద్రాన్ని జాతికి అంకితమిచ్చారు. దాంతో పాటు పలు రైల్వే అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ప్రధానమంత్రి, అంబారి - పింపల్‌కుట్టి విద్యుదీకరణ ప్రాజెక్టు, డబ్లింగ్, విద్యుదీకరించిన సనత్‌నగర్ - మౌలాలి మార్గాలను ప్రారంభించారు.

వెల్‌కమ్‌ చెప్పిన సీఎం : అంతకుముందు ఆదిలాబాద్‌ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ ఘన స్వాగతం పలికారు. సీఎం రేవంత్ మోదీని శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మంత్రి సీతక్క సహా పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు.

రేపు సంగారెడ్డిలో ప్రధాని పర్యటన : రాష్ట్రంలో రెండు రోజుల పర్యటనలో భాగంగా నేడు ఆదిలాబాద్‌లో పర్యటించిన మోదీ, రేపు సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. తొలుత బేగంపేట విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి విమానయాన పరిశోధన సంస్థను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. సుమారు రూ.9,021 కోట్ల విలువ చేసే పనులకు పీఎం మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఆ తర్వాత బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.

Last Updated :Mar 4, 2024, 1:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.