ETV Bharat / politics

సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్​రావు బహిరంగ లేఖ - రుణమాఫీ ఎప్పుడు చేస్తారని ప్రశ్న - Harish Rao Open Letter to CM

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 3, 2024, 11:56 AM IST

Harish Rao Open Letter to CM Revanth : సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్​రావు బహిరంగ లేఖ రాశారు. అధికారంలోకి రాగానే డిసెంబర్ 9 న రైతులకు రూ.2లక్షల రుణమాఫీ ఒకేసారి చేస్తామని ఎన్నికల మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. అలాగే రైతులకు ఎకరానికి రూ.15 వేలు పెట్టుబడి సాయం ఇవ్వాలని తన లేఖలో కోరారు.

Harish Rao Open Letter to CM Revanth
Harish Rao Open Letter to CM Revanth

Harish Rao Open Letter to CM Revanth : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ సిద్ధిపేట ఎమ్మెల్యే హారీశ్ రావు బహిరంగ లేఖ రాశారు. బ్యాంకుల నుంచి నోటీసులు, ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న రైతులకు తక్షణం రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని లేఖలో పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే డిసెంబర్ 9 నాడే 2 లక్షల రుణమాఫీ ఒకేసారి చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు.

Hareesh Rao On Congress : "బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.లక్ష రూపాయల రుణమాఫీ(Loan Waiver) పొందిన రైతులు కూడా మళ్లీ బ్యాంకులకు వెళ్లి రూ.2 లక్షల రుణాలు(Loans) తీసుకోవాలని మీరే స్వయంగా పిలుపునిచ్చారని లేఖలో ప్రస్తావించారు. రేవంత్​రెడ్డి మాటను నమ్మి రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులు బ్యాంకుల నుంచి పంట రుణాలు తీసుకున్నారని డిసెంబర్ 9 నాడు మీరు(రేవంత్ రెడ్డి) ప్రకటించినట్టుగా రుణమాఫీ జరగలేదు" అని హరీశ్ రావు అన్నారు.

"రుణమాఫీ విషయంలో మీరు తక్షణం స్పందించాలని డిమాండ్ చేస్తున్నాను. రూ.2 లక్షల వరకు రుణమాఫీని ఎప్పట్లోగా చేస్తారో స్పష్టమైన తేదీ ప్రకటించాలని రైతుల పక్షాన కోరుతున్నాను. రైతుల రుణాలను ప్రభుత్వమే చెల్లిస్తుందని బ్యాంకర్లకు హామీ పత్రం రాసివ్వాలని విన్నవించుకుంటున్నాను. దేశానికి అన్నం పెట్టే రైతుకు భరోసా ఇవ్వడం ప్రభుత్వ కనీస బాధ్యత"- హరీశ్ రావు, బీఆర్ఎస్ నేత

మీరు అధికారంలోకి వచ్చి దాదాపు 4 నెలలు కావొస్తున్నది. అయినప్పటికీ ఒక్క రైతుకు కూడా ఒక్క రూపాయి రుణమాఫీ కాలేదని హరీశ్ రావు ఆరోపించారు. రూ.2 లక్షల వరకు రుణమాఫీని ఎప్పట్లోగా చేస్తారో స్పష్టమైన తేదీ ప్రకటించాలని రైతుల పక్షాన కోరుతున్నానని హరీశ్ లేఖలో పేర్కొన్నారు. రైతులకు రుణమాఫీ చేయడంతో పాటు, పంట మద్దతు ధరపై 500 బోనస్, ఎకరానికి 15 వేల చొప్పున పెట్టుబడి సాయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పంటపొలాలకు నీళ్లు, 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ అందించాలని హరీశ్ రావు కోరారు.

కాంగ్రెస్​కు రాజకీయాలే తప్ప రైతుల సమస్యలు పట్టవు : హరీశ్​ రావు

పాడి రైతులకు పెండింగ్​లో ఉన్న రూ. 80 కోట్ల బిల్లులు చెల్లించాలి - సీఎం రేవంత్​కు హరీశ్​రావు లేఖ -

కేసీఆర్ 'పొలం బాట' పట్టాక రాష్ట్ర ప్రభుత్వం మేల్కొంది : ఎమ్మెల్యే హరీశ్‌రావు -

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.