ETV Bharat / politics

ఎల్​ఆర్ఎస్​పై బీఆర్ఎస్ పోరు - నేడు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 6, 2024, 9:11 AM IST

BRS Protest Against LRS in Telangana 2024 : లే అవుట్ల క్రమబద్ధీకరణ పథకాన్ని ఉచితంగా చేయాలని డిమాండ్ చేస్తూ, బీఆర్ఎస్​ నేడు నిరసనలకు పిలుపునిచ్చింది. గతంలో స్కీం రద్దు చేస్తామని చెప్పిన భట్టి విక్రమార్క మాటలు ఏమయ్యాయంటూ నిలదీసింది. ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజుల రూపంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం డబ్బు వసూలు చేస్తోందని ఆరోపించింది.

BRS Leaders Protest Seeking Free LRS
KTR Calls Dharna For Free LRS

BRS Protest Against LRS in Telangana 2024 : లే అవుట్ల క్రమబద్ధీకరణ - ఎల్​ఆర్​ఎస్​ను ఉచితంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భారత్ రాష్ట్ర సమితి ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. కాంగ్రెస్ నేతలు గతంలో చెప్పినట్లుగా ఎలాంటి ఛార్జీలు లేకుండా ఉచితంగా లే అవుట్​ రెగ్యులరైజేషన్​ స్కీమ్​ (LRS)​ చేయాలని గులాబీ పార్టీ​ డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాకు దిగనుంది.

BRS Leaders Protest Seeking Free LRS : ఎన్నికలకు ముందు ఉచితంగా ఎల్​ఆర్​ఎస్​ అమలు చేస్తామన్న వ్యాఖ్యలకు విరుద్ధంగా చేస్తున్న ప్రభుత్వ వైఖరిపై రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ నిరసనలకు పార్టీ పిలుపునిచ్చింది. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఇవాళ ధర్నా కార్యక్రమాలు చేపట్టనుంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో జీహెచ్​ఎమ్​సీ, హెచ్​ఎమ్​డీఏ కార్యాలయాల(HMDA Office) వద్ద బీఆర్ఎస్​ నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు, నేతలు నిరసనల్లో పాల్గొంటారు. రేపు అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లు, ఆర్డీఓలకు వినతిపత్రాలు ఇవ్వాలని నిర్ణయించారు.

ఎల్ఆర్ఎస్ విషయంలో కాంగ్రెస్​ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల కేంద్రాల్లో బీఆర్ఎస్ ధర్నాలు (BRS Dharna Against LRS) నిర్వహించనున్నట్లు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. రాష్ట్ర ప్రజలపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందని ఆరోపించారు. ఎన్నికల్లో గెలవడానికి అడ్డమైన హామీలు ఇచ్చి, ఆ పార్టీ ప్రజలను గందరగోళం చేసిందని విమర్శించారు.

ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

KTR On LRS Issue Telangana : లేఅవుట్ల క్రమబద్ధీకరణపై కాంగ్రెస్ వైఖరిని ప్రజలు గమనించాలన్న కేటీఆర్(BRS Working President KTR) విపక్షంలో ఉన్నప్పుడు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క మాట్లాడిన మాటలను గుర్తు చేశారు. ఇప్పుడు హస్తం నేతలు ప్రజల రక్త మాంసాలను పీలుస్తున్నారు అని మండిపడ్డారు. ప్రజల నుంచి రూ.20 వేల కోట్లు వసూలు చేసేందుకు వేసిన ఎత్తుగడ ఎల్​ఆర్ఎస్ కాదా అని నిలదీశారు. మధ్య తరగతి ప్రజలపై భారాన్ని మోపడం తగదని, ఒక్కో ఫ్యామీలపై లక్ష రూపాయల వరకు భారం పడుతుందని కేటీఆర్ వివరించారు.

KTR Calls For Dharna : గతంలో కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారమే 25 లక్షల కుటుంబాలకు ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఖరిపై(Govt Attitude) క్షేత్ర స్థాయి పోరాటాలు చేస్తామని ప్రకటించిన ఆయన, నేడు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ప్రజలు కూడా బీఆర్ఎస్​తో కలిసి రావాలని కేటీఆర్​ కోరారు. అదేవిధంగా ఎల్ఆర్ఎస్​​పై న్యాయ పోరాటం కూడా చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ద్వంద్వ వైఖరిని ఎండగడతామని పేర్కొన్నారు.

హామీల అమలుపై మాట మార్చడం కాంగ్రెస్‌కు అలవాటైంది: హరీశ్‌రావు

మూడేళ్లకు ఎల్‌ఆర్‌'ఎస్‌' - సర్కారు నిర్ణయంతో హెచ్​ఎండీఏకు రూ.1000, జీహెచ్​ఎంసీకి రూ.450 కోట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.