ETV Bharat / politics

రాష్ట్రంలో కేసీఆర్‌ను గద్దె దించి - దొంగలు పోయి గజ దొంగలు వచ్చారు : కిషన్‌ రెడ్డి - BJP Kishan Reddy Fires on Congress

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 9, 2024, 4:49 PM IST

Updated : Apr 9, 2024, 7:06 PM IST

BJP Kishan Reddy Fires on Congress : రాష్ట్రంలో ప్రభుత్వం మారింది కానీ పాలన మారలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. దొంగల చేతి నుంచి అధికారం పోయి, గజ దొంగల చేతికి వచ్చిందని వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ ప్రకటించిన హామీలను అమలు చేయడంలో సీఎం రేవంత్‌ రెడ్డి విఫలమయ్యారని మండిపడ్డారు.

BRS Leaders Joined in BJP
BJP Kishan Reddy Fires on Congress

BJP Kishan Reddy Fires on Congress : కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణను కేసీఆర్‌ కుటుంబం తమ స్వార్థం కోసం వాడుకుందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ పదేళ్లలో ప్రజల కోసం ఆలోచన చేయలేదని, ఫామ్‌హౌస్‌ ఎలా పెంచుకోవాలని చూశారని మండిపడ్డారు. కేసీఆర్‌ను గద్దె దించి, దొంగలు పోయి గజ దొంగలు వచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని చెప్పిన రేవంత్‌ రెడ్డి, ఆ ఊసే ఎత్తడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌ రెడ్డికి డిసెంబర్‌ 9 ఇంకా వచ్చినట్లు లేదని ఎద్దేవా చేశారు.

BRS Leaders Joined in BJP : పాత గ్యారంటీలే అమలు చేయలేదు కానీ తుక్కుగూడకు వచ్చి కొత్త హమీలు ఇచ్చారని కిషన్​రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీలు మారాయి తప్పితే, పాలన మారలేదన్నారు. కాంగ్రెస్‌, బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒక్కటేనని, వాటి డీఎన్‌ఏ కూడా ఒక్కటే అని విమర్శించారు. జహీరాబాద్‌, నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి పలువురు నేతలు బీజేపీలో చేరారు. మాజీ మంత్రి నేరేళ్ల ఆంజనేయులు, జుక్కల్ మాజీ ఎమ్మెల్యే పండరి, నల్గొండకు చెందిన పిల్లి రామరాజు యాదవ్‌ తదితరులు కిషన్‌ రెడ్డి, లక్ష్మణ్‌ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు.

దేశప్రధానిగా నరేంద్రమోదీ మూడోసారి అధికారం చేపట్టడం ఖాయం : కిషన్‌రెడ్డి - lok sabha elections 2024

కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేసినందుకు రాహుల్‌ గాంధీ ట్యాక్స్‌ వేస్తున్నారని కిషన్​ రెడ్డి మండిపడ్డారు. పరిశ్రమలు, గుత్తేదారులను బెదిరించి రూ.వందల కోట్లు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ మూడు రాష్ట్రాలకే పరిమితమైనా, వారి బుద్ధి మారలేదన్నారు. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి 40కి మించి సీట్లు రావన్నారు. దేశ అభివృద్ధి, గౌరవం, భద్రత ఉండాలంటే మోదీ ప్రభుత్వం మళ్లీ రావాలని ఆకాంక్షించారు.

కేసీఆర్‌ను గద్దే దించి ఆ స్థానంలో దొంగలు పోయి గజ దొంగలు వచ్చారు కిషన్‌రెడ్డి

రూ.2500కే దిక్కు లేదు - రూ.లక్ష ఇస్తామంటూ మరోసారి మోసానికి తెర లేపారు : లక్ష్మణ్ - BJP MP Laxman Fires on Congress

BJP Laxman on BRS Party : రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ది ముగిసిన అధ్యాయమని, బీఆర్ఎస్‌కు ఒక్క సీట్‌ కూడా రాదని, అందుకు ఆ పార్టీకి ఓటు వేస్తే మురిగిపోతుందని రాజ్యసభ సభ్యడు లక్ష్మణ్‌ ఎద్దేవా చేశారు. తెలంగాణలో కాంగ్రెస్‌ మటుమాయం కావడం ఖాయమని జోస్యం చెప్పారు. దేశంలో మునిగిపోతున్న నావ కాంగ్రెస్ అన్నారు. తెలంగాణలో 10 నుంచి 12 స్థానాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

6 గ్యారంటీలు అమలు చేయకుండా - రాహుల్‌ గాంధీ తెలంగాణ ఎలా వస్తారు? : కిషన్‌ రెడ్డి - Kishan Reddy on Rahul Gandhi

Last Updated :Apr 9, 2024, 7:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.