ETV Bharat / politics

'మా ప్రభుత్వంలో ముఖ్యమంత్రిని కలిసే స్వేచ్ఛ అందరికీ ఉంటుంది - ఏ పార్టీవారైనా సీఎంను కలవొచ్చు'

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 29, 2024, 3:44 PM IST

Updated : Jan 29, 2024, 4:03 PM IST

Bhatti Vikramarka Reaction on BRS MLAs Meeting CM Revanth Reddy
Bhatti Vikramarka

Bhatti Vikramarka Reaction on BRS MLAs Meeting CM Revanth Reddy : బీఆర్​ఎస్​కు చెందిన ఎమ్మెల్యేలు సీఎం రేవంత్​ రెడ్డిని కలవడంలో ఇతర అంశాలేమీ లేవని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. కేసీఆర్ సర్కార్​​ మాదిరి సంస్కృతి కాంగ్రెస్​లో లేదన్నారు. తమ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిని కలిసే స్వేచ్ఛ అందరికీ ఉంటుందని స్పష్టం చేశారు.

Bhatti Vikramarka Reaction on BRS MLAs Meeting CM Revanth Reddy : రాజేంద్రనగర్ బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే ప్రకాశ్​గౌడ్ సీఎం రేవంత్​ రెడ్డిని కలిసిన అంశంపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పందించారు. భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సీఎంను కలవడంలో ఇతర అంశాలేమీ లేవన్నారు. బీఆర్​ఎస్​ సర్కార్​ మాదిరి సంస్కృతి కాంగ్రెస్​లో లేదని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యయుతంగా హస్తం పార్టీ అందరినీ గౌరవిస్తుందని వివరించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల బూత్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

Secunderabad Parliament Election Booth Committee Meeting : ఈ సందర్భంగా పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుస్తామని భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్​ను అభివృద్ధి చేసింది కాంగ్రెస్సేనని పునరుద్ఘాటించారు. మంచినీళ్లు, విమానాశ్రయం, ప్రాజెక్టులు, పారిశ్రామిక రంగానికి పెద్దపీట వేసి ప్రారంభించింది హస్తం పార్టీయే అని తెలిపారు. కేటీఆర్, హరీశ్​రావులు తామే హైదరాబాద్​ను అభివృద్ధి చేశామని చెప్పడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. మరోవైపు సికింద్రాబాద్ పార్లమెంట్‌ స్థానాన్ని కాంగ్రెస్ గెలుస్తుందని భట్టి ధీమా వ్యక్తం చేశారు. బూత్ కమిటీ అధ్యక్షులను నియమించుకుని, పక్కా ప్రణాళిక ప్రకారం లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు అనిల్, స్థానిక కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంపద సృష్టించే వారిని ఎప్పుడూ గాయపరచం : భట్టి విక్రమార్క

బీఆర్​ఎస్​కు చెందిన ఎమ్మెల్యేలు సీఎం రేవంత్​ రెడ్డిని కలవడంలో ఇతర అంశాలేమీ లేవు. బీఆర్​ఎస్​ సర్కార్​ మాదిరి సంస్కృతి కాంగ్రెస్​లో లేదు. మాది ప్రజా ప్రభుత్వం. మా పార్టీ ఎమ్మెల్యేలు సీఎంను ఎలాగైతే స్వేచ్ఛగా కలుస్తారో, ఇతర పార్టీ శాసనసభ్యులూ అలాగే కలవొచ్చు. ఆ స్వేచ్ఛ అందిరికీ ఉంటుంది. - భట్టి విక్రమార్క, ఉప ముఖ్యమంత్రి

'మా ప్రభుత్వంలో ముఖ్యమంత్రిని కలిసే స్వేచ్ఛ అందరికీ ఉంటుంది - ఏ పార్టీవారైనా సీఎంను కలవొచ్చు'

సీఎం రేవంత్​ను కలిసిన మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే - అసలేం జరుగుతోంది?

అసలు ఏం జరిగిందంటే? బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్‌ గౌడ్‌ ఆదివారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు. తన నియోజకవర్గమైన రాజేంద్రనగర్‌లోని శంషాబాద్ మండలం కొత్వల్​గూడా, బహదూర్ గూడా, ఘన్సిమియాగూడా గ్రామాల్లో గల భూ సమస్యల పరిష్కారం కోసం సీఎంను కలిసినట్లు ప్రకాశ్‌ గౌడ్‌ తెలిపారు. అలాగే నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని కోరినట్లు వెల్లడించారు. అందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని ఆయన వివరించారు. అయితే ఈ భేటీలో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. తాను కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని తేల్చి చెప్పారు. ఇదిలా ఉండగా ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్​ఎస్ ఎమ్మెల్యేలు ఇటీవల రేవంత్​ను కలిసిన సంగతి తెలిసిందే.

సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

Last Updated :Jan 29, 2024, 4:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.