ETV Bharat / opinion

జగన్‌ అక్రమాస్తుల కేసు జాప్యానికి కారణమేంటీ? - 4 వారాల్లో అఫిడవిట్‌ దాఖలుకు సుప్రీం ఆదేశం - YS Jagan Illegal Assets Case

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 2, 2024, 11:33 AM IST

Updated : Apr 2, 2024, 1:21 PM IST

Pratidhwani on CM YS Jagan Illegal Assets Case
Pratidhwani on CM YS Jagan Illegal Assets Case

Pratidhwani on CM YS Jagan Illegal Assets Case: సీఎం జగన్‌ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ట్రయల్‌ ఎందుకు జాప్యం అవుతుందో చెప్పాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. రాజకీయ కారణాలతో ట్రయల్‌ ఆలస్యం కాకూడదని పేర్కొంది. నిందితుడు ముఖ్యమంత్రి కావటం వలన ట్రయల్‌ జాప్యం కావద్దని సీబీఐకి స్పష్టం చేసింది. "జగన్ కేసుల జాప్యం - సుప్రీం సూటి ప్రశ్నలు" అనే అంశంపై ఇదీ నేటి ప్రతిధ్వని. ఈ చర్చలో భారత న్యాయవాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.సుబ్బారావు, హైకోర్టు సీనియర్ న్యాయవాది ఎస్‌.రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.

Pratidhwani on CM YS Jagan Illegal Assets Case : సీఎం జగన్‌ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ట్రయల్‌ ఎందుకు జాప్యం అవుతుందో చెప్పాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. రాజకీయ కారణాలతో ట్రయల్‌ ఆలస్యం కాకూడదని పేర్కొంది. నిందితుడు ముఖ్యమంత్రి కావటం వలన ట్రయల్‌ జాప్యం కావద్దని సీబీఐకి స్పష్టం చేసింది. జగన్ కేసుల్లో జాప్యంపై అఫిడవిట్‌ ఎందుకు వేయలేదో చెప్పాలని సీబీఐని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా సూటిగా ప్రశ్నించారు. వై అధినేత జగన్‌పై ఎన్నికేసులు ఉన్నాయి? ఎందుకు ఆలస్యం అయ్యాయి? చివరకి సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్నా కేసులు ఎందుకు ముందుకు కదలట్లేదు? "జగన్ కేసుల జాప్యం - సుప్రీం సూటి ప్రశ్నలు" అనే అంశంపై ఇదీ నేటి ప్రతిధ్వని. ఈ చర్చలో భారత న్యాయవాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.సుబ్బారావు, హైకోర్టు సీనియర్ న్యాయవాది ఎస్‌.రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Supreme Court Hearing on CM Jagan Illegal Assets Case : జగన్‌ అక్రమాస్తుల కేసుపై సుప్రీం కోర్టు విచారణ జరిపింది. ఈ క్రమంలో ట్రయల్‌ ఎందుకు జాప్యం అవుతుందో కారణాలు చెప్పాలని సీబీఐని ఆదేశించింది. నాలుగు వారాల్లో అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశిస్తూ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాల ధర్మాసనం విచారణను వాయిదా వేశారు. డిశ్చార్జ్‌ పిటిషన్ల కారణంగా ఆలస్యమవుతోందని సీబీఐ తరఫు అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌వీ రాజు కోర్టుకు తెలిపారు. రాజకీయ కారణాలతో ట్రయల్‌ ఆలస్యం కాకూడదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ట్రయల్‌ సవ్యంగానే జరుగుతోందని ధర్మాసనానికి సీబీఐ తెలిపింది. సవ్యంగా జరుగుతుందని చెప్పడం కాదు అఫిడవిట్‌ ఎందుకు ఫైల్‌ చేయలేదో చెప్పాలని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ప్రశ్నించారు.

జగన్‌ కేసుల విచారణలో జాప్యం ఎందుకు?- అఫిడవిట్‌ వేయాలంటూ సీబీఐకు సుప్రీం ఆదేశాలు - SC on CM Jagan Illegal Assets Case

CM Jagan Illegal Assets Case : ముఖ్యమంత్రి అన్న కారణంగానే ట్రయల్‌ ఆలస్యం అవుతోందనేది ప్రధాన ఆరోపణ దానికి ఏం సమాధానం చెపుతారని కోర్టు నిలిదీసింది. సీఎం అయితే వ్యక్తిగత హాజరు నుంచి ఎందుకు మినహాయింపు అడుగుతున్నారని ధర్మాసనం ప్రశ్నించింది. ట్రయల్‌ సుధీర్ఘంగా సాగుతుంటే వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వకూడదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇలాంటి విషయాల్లో విచారణ జరుపుతున్న కోర్టులే నిర్ణయం తీసుకోవాలని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. ట్రయల్‌ వేగంగా జరపాలని ఆదేశించారు. బెయిల్‌ రద్దు, హైదరాబాద్‌ నుంచి ట్రయల్‌ మరో రాష్ట్రానికి బదిలీ పిటిషన్లను కలిపే విచారణ చేపడుతామని సుప్రీం ధర్మసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఆగస్టు 5 నుంచి ప్రారంభమయ్యే వారానికి వాయిదా వేసింది.

Jagan Illegal Cases Investigation in CBI Court : సీబీఐ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసులపై విచారణ జరిగింది. జగన్, ఇతర నిందితుల డిశ్చార్జి పిటిషన్లపై న్యాయస్థానంలో వాదనలు జరిగాయి. సీబీఐ, ఈడీ కేసుల్లో (CBI Cases on CM Jagan) డిశ్చార్జి పిటిషన్లపై తదుపరి విచారణను ఈనెల 18 కి కోర్టు వాయిదా వేసింది.

సీఎం అన్న కారణంగా విచారణలో జాప్యం కావొద్దు - జగన్‌ అక్రమాస్తుల కేసుపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు - Supreme Court on CM Jagan cases

Last Updated :Apr 2, 2024, 1:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.