ETV Bharat / bharat

తిరుపతి దర్శనం పేరుతో ధోని మేనేజర్​కు కుచ్చుటోపీ- రూ.6.33 లక్షలు టోకరా

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 3, 2024, 8:09 PM IST

MS Dhoni Manager Fraud Case
MS Dhoni Manager Fraud Case

MS Dhoni Manager Fraud Case : ఓ గుర్తు తెలియని వ్యక్తి తిరుపతి ప్రత్యేక దర్శనానికి టికెట్లు ఇప్పిస్తామని చెప్పి మహేంద్ర సింగ్ ధోని మేనేజర్​ను మోసం చేశాడు. ఆ మేనేజర్​ను నమ్మించి అతడి స్నేహితుడికి రూ.6.33 లక్షలు టోకరా వేశారు.

MS Dhoni Manager Fraud Case : తిరుపతి ప్రత్యేక దర్శనం కోసం టికెట్లు ఇప్పిస్తామని చెప్పి మహేంద్ర సింగ్ ధోనీ మేనేజర్​ స్వామినాథన్ శంకర్​ను ఓ గుర్తు తెలియని వ్యక్తి మోసం చేశాడు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పీఏ అని చెప్పుకునే ఓ వ్యక్తి ద్వారా పరిచయం చేసుకొని లక్షలు దోచేశాడు. అతడిని నమ్మిన స్వామినాథన్ స్నేహితుడు- తిరుపతి ప్రత్యేక దర్శనం కోసమని నిందితుడికి రూ.6.33 లక్షలు పంపించాడు. చివరకు మోసం జరిగిందని గ్రహించిన స్వామినాథన్, అతడి స్నేహితుడు బెంగళూరులోని హెచ్​ఎస్​ఆర్​ లేఅవుట్ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

అసలేం జరిగిందంటే
గతేడాది అక్టోబర్​లో ధోనీ మేనేజర్ ​స్వామినాథన్​ శంకర్​కు ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్​ వచ్చింది. ఆ వ్యక్తి తాను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రికి సన్నిహితుడినని, తన పేరు నకుల్ అని పరిచయం చేసుకున్నాడు. అలానే సందీప్​ అనే ఓ న్యాయమూర్తి కుమారుడు ధోనీని కలవాలనుకుంటున్నట్లు చెప్పాడు. దీంతో అక్టోబర్ 29న సందీప్, సల్మాన్ అనే మరో వ్యక్తి ఐటీసీ బెంగాల్ హోటల్​లో ధోనీని కలిశారు. అప్పుడే 'మీకు కావాల్సినప్పుడు తిరుపతి వేంకటేశ్వర స్వామి ప్రత్యేక దర్శనానికి ఏర్పాటు చేస్తాం' అని ధోనీ మేనేజర్ స్వామినాథన్​కు సందీప్ చెప్పాడు.

ఆ తర్వాత నవంబర్ 30న స్వామినాథన్​కు, సందీప్ ఫోన్​ చేసి 12 మందికి తిరుపతి ప్రత్యేక దర్శనానికి పాస్​లు ఉన్నాయని చెప్పాడు. అప్పుడు స్వామినాథన్ తాను దుబాయ్​లో ఉన్నానని, ఆ పాస్​లు వేరే వాళ్లకి​ ఇవ్వొచ్చు అని బదులిచ్చాడు. కానీ మీరే వేరే వాళ్లకు ఇవ్వండి అని స్వామినాథన్​కు సందీప్​ చెప్పాడు.

అనంతరం స్వామినాథన్ కుడ్లుగేట్​లో ఓ పాఠశాల నడుపుతున్న తన స్నేహితుడు వినీత్​ చంద్రశేఖర్​కి ఫోన్​ చేసి తిరుపతి దర్శనం గురించి వివరించాడు. దీంతో దర్శనానికి వినీత్​ సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో వినీత్​కు నాగేశ్వర్​రావు అనే వ్యక్తి ఫోన్​ చేసి ప్రత్యేక దర్శనం, గది తదితర ఖర్చుల కోసం రూ.3 లక్షలు చెల్లించాలని చెప్పాడు. దాంతోపాటు ఏమైనా విరాళంగా ఇవ్వాలనుకుంటే అవి కూడా ఇవ్వొచ్చు అని తెలిపాడు.

నాగేశ్వరరావు మాటలు నమ్మిన వినీత్​ విరాళం, దర్శనం ఖర్చులు మొత్తం కలిపి రూ.6.33 లక్షలను గూగుల్​ పే నుంచి ట్రాన్స్​ఫర్ చేశాడు. అయితే నగదును చెల్లించిన తర్వాత తిరపతి ప్రత్యేక దర్శనం టికెట్లు రాలేదు. దీంతో నాగేశ్వర్​రావుకు ఫోన్​ చేస్తే డబ్బులను తిరిగి చెల్లిస్తామని చెప్పాడు. కానీ ఎంతకూ చెల్లించకపోవడం వల్ల మోసపోయామని గ్రహించిన వినీత్​, స్వామినాథన్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

బ్యాంకు మేనేజర్ చేతివాటం- ఖాతాదారుల పేర్లు మీద లోన్లు, బంధువుల అకౌంట్లలోకి రూ3 కోట్లు

Navy Officer Fraud : ముగ్గురిని హత్య చేసిన మాజీ నేవీ ఆఫీసర్​.. తప్పించుకునేందుకు పక్కా స్కెచ్.. 20 ఏళ్ల తర్వాత..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.