ETV Bharat / bharat

కన్నతండ్రిపైనే అత్యాచార ఆరోపణలు- 12ఏళ్ల తర్వాత నిర్దోషిగా విడుదల- లవర్​తో అలా చూసినందుకే

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 31, 2024, 10:48 PM IST

Daughter False Rape Case On Father In Madhya Pradesh
Daughter False Rape Case On Father

Daughter False Rape Case On Father : కన్నకూతురు చేసిన అత్యాచార ఆరోపణల కేసులో 12 ఏళ్ల తర్వాత నిర్దోషిగా జైలు నుంచి బయటకు రానున్నారు మధ్యప్రదేశ్​కు చెందిన ఓ అమాయకపు తండ్రి. ఈ మేరకు హైకోర్టు తీర్పు వెలువరించింది.

Daughter False Rape Case On Father : సొంతకుమార్తె చేసిన అత్యాచార ఆరోపణల కేసులో జైలుకెళ్లిన ఓ తండ్రి 12ఏళ్ల తర్వాత నిర్దోషిగా విడుదలకానున్నారు. 12ఏళ్ల క్రితం దోషిగా తేలుస్తూ ట్రయల్​ కోర్టు తీర్పును పలుమార్లు సవాలు చేసిన తండ్రికి తాజాగా విముక్తి లభించింది. ఆయన్ను నిర్దోషిగా తేల్చుతూ మధ్యప్రదేశ్​ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ మేరకు ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం తండ్రిపై కన్నకూతురు మోపిన అభియోగాల్లో నిజం లేదని తేల్చింది. ఎలాంటి నేరం చేయకుండా జైలు శిక్ష అనుభవించిన తండ్రిని వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది.

సొంత తండ్రిపైనే తప్పుడు ఆరోపణలు!
మధ్యప్రదేశ్​లోని జబల్​పుర్​ జిల్లాకు చెందిన 15 ఏళ్ల ఓ బాలిక(12 ఏళ్ల క్రితం) సొంత తండ్రే తనపై రెండుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఆరోపిస్తూ భోపాల్‌లోని ఓ పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అరెస్టు చేశారు. దర్యాప్తు అనంతరం ట్రయల్​ కోర్టులో హాజరుపరిచారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేయకుండానే న్యాయస్థానం తండ్రిని దోషిగా తేల్చుతూ జీవితఖైదు విధించింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం
'ఓరోజు తన తండ్రి తనపై బలవంతంగా అత్యాచారం చేశాడని బాలిక చెప్పింది. దీంతో ఆమె తన తాతయ్య ఇంటికి పారిపోయింది. కొద్దిరోజులకే మళ్లీ తండ్రి వద్దకు తిరిగి వచ్చిన ఆ బాలికపై మళ్లీ అఘ్యాయిత్యానికి పాల్పడ్డాడంటూ స్థానిక పోలీసు స్టేషన్​ను ఆశ్రయించి కంప్లైంట్​ చేసింది. ఆ సమయంలో బాలిక వయస్సు 15 సంవత్సరాలు. ఇక అమ్మాయి ఫిర్యాదు మేరకు మేము ఆమె తండ్రిని అదుపులోకి తీసుకున్నాము. అనంతరం ట్రయల్​ కోర్టులో హాజరుపరిచాము. విచారణ అనంతరం న్యాయమూర్తి ఆయనకు జీవితఖైదు జైలుశిక్ష విధించింది. అప్పటినుంచి ఇప్పటివరకు తండ్రి జైలులోనే శిక్షను అనుభవించాడు' అని సంబంధిత పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

ఇక ట్రయల్​ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేసేందుకు బాధిత తండ్రి సిద్ధమయినా ఆయన కేసును విచారించేందుకు ఏ ఒక్క న్యాయవాది ముందుకురాలేదు. దీంతో ఈ విషయం హైకోర్టు లీగల్​ సెల్​ దృష్టికి వెళ్లింది. అలా 2013లో తొలిసారి ఈకేసుపై అప్పీలుకు వెళ్లగా సాంకేతిక కారణాలతో కేసును కొట్టివేసింది హైకోర్టు. అనంతరం ఈ కేసు ఫైల్​ను లీగల్​ సర్వీసెస్​ కమిషన్ న్యాయవాది వివేక్ అగర్వాల్‌కు అందించింది. ఈ కేసు వివరాలను క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన ట్రయల్​ కోర్టు ముందు సమర్పించిన వాస్తవాలు చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాయంటూ వాదించారు. ట్రయల్​ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తు న్యాయవాది వివేక్ అగర్వాల్‌ మరోసారి హైకోర్టు ముందుకు ఈ కేసును తీసుకువెళ్లారు. తన వాదనలతో 12ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న తండ్రిని నిర్దోషిగా తేల్చేందుకు పూనుకున్నారు. అలా ఈయన సాయంతో చేయని నేరానికి ఇన్నేళ్లు జైలుశిక్షను అనుభవించిన ఆ తండ్రి జైలు నుంచి విడుదల కానున్నారు.

'ప్రియుడితో నా కూతురిని చూశాను'
తన కుమార్తెను ఆమె ప్రేమికుడితో అభ్యంతరకర స్థితిలో చూశానని బాధిత తండ్రి చెప్పాడు. ఇది చూసిన బాలిక వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసిందని తెలిపాడు. కాగా, తన తండ్రికి వ్యతిరేకంగా కేసు పెట్టించడంలో బాలిక ప్రియుడి పాత్ర ఉన్నట్లుగా తేలిందని న్యాయవాది వివేక్ అగర్వాల్ అన్నారు.

"ఈ కేసులో చట్టపరమైన లోపాలు చాలా ఉన్నాయి. ఏదైనా అత్యాచారం కేసులో సెక్షన్ 165 ప్రకారం, ఫిర్యాదుదారుడి వాంగ్మూలాన్ని న్యాయమూర్తి ముందు రికార్డు చేయాలి. కానీ, ఈ కేసులో అలాంటిదేమీ జరగలేదు. బాధిత తండ్రిని వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో కొందరు వ్యక్తుల కారణంగా ఒక అమాయకపు వ్యక్తి 12 ఏళ్లు జైలులో ఉండాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈయన భోపాల్​ జైలులో ఉన్నారు. ఈరోజు విడుదలవుతారు."
- వివేక్ అగర్వాల్, న్యాయవాది

అయితే ఇదే కోర్టులో, తండ్రిపై ఆరోపణలు చేసిన బాలిక మాట్లాడుతూ తన ప్రియుడి సూచన మేరకే ఈ విధంగా ప్రవర్తించానంటూ స్వయంగా తానే చెప్పిందని లాయర్​ వివేక్ అగర్వాల్ పేర్కొన్నారు.

ఝార్ఖండ్ కొత్త సీఎంగా చంపై సోరెన్- ఈడీ కస్టడీలో హేమంత్

వరుడు లేకుండానే వందలాది యువతుల పెళ్లి- ఎందుకో తెలిస్తే షాక్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.