ETV Bharat / bharat

ఫ్లైఓవర్ నుంచి కింద పడిన బస్సు- ఐదుగురు మృతి, 40మందికి గాయాలు - Bus Accident In Odisha

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 16, 2024, 6:56 AM IST

Updated : Apr 16, 2024, 8:34 AM IST

Bus Accident In Odisha
Bus Accident In Odisha

Bus Accident In Odisha : ఒడిశాలోని జాజ్​పుర్​ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు వంతెనపై నుంచి పడటం వల్ల ఐదుగురు మృతి చెందగా, 35 మంది గాయపడ్డారు. మృతుల కుటుంబాలకు ఒడిశా సీఎం రూ.3 లక్షల ఆర్థిక సహాయన్ని ప్రకటించారు.

Bus Accident In Odisha : బస్సు వంతెనపై నుంచి పడి ఐదుగురు మృతి చెందారు. 35మంది గాయపడ్డారు. ఈ ఘటన ఒడిశా జాజ్​పుర్​​ జిల్లాలో సోమవారం రాత్రి జరిగింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.

ఇదీ జరిగింది
మొత్తం 47మంది ప్రయాణికులతో పూరీ నుంచి బంగాల్​కు సోమవారం మధ్యాహ్నం బస్సు బయలుదేరింది. రాత్రి 9 గంటల సమయంలో జాజ్​పుర్​​లోని 16వ జాతీయ రహదారిపై బస్సు ప్రయాణిస్తున్న క్రమంలో బారాబతి వద్ద ఫ్లైఓవర్ దాటుతుండగా బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో ఫ్లైఓవర్​ పైనుంచి బస్సు రోడ్డుపై పడిపోయింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ సహా ఐదుగురు వ్యక్తులు మృతిచెందారు. గాయపడిన వారి వెంటనే కటక్​లోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.3లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు.

ఈ ఘటనలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స కోసం వైద్యుల బృందాన్ని ఏర్పాటు చేసినట్లు రవాణా కమిషనర్ అమితవ్ ఠాకూర్ తెలిపారు. 'ఈ ప్రమాదంలో గాయపడిన వారిని 16 అంబులెన్స్​ల సాయంతో కటక్​ ఆస్పత్రికి తరలించాం. గ్యాస్​ కట్టర్లను ఉపయోగించి బస్సు కిటికీలు కత్తిరించి ప్రయాణికులను రక్షించాం. అనంతరం బస్సును క్రేన్​ సహాయంతో పైకి తీశాం. ప్రయాణికుల్లో ఎక్కువ మంది బంగాల్​కు చెందినవారే ఉన్నారు' అని అమితవ్ పేర్కొన్నారు.

రోడ్డు పక్కన నిల్చున్న వారిపై మట్టి లారీ బోల్తా- ఐదుగురు మృతి
Lorry Overturned Today Karnataka : ఇటీవలే కర్ణాటకలోని బాగల్​కోట్​ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని మట్టి లోడ్​తో వెళ్తున్న లారీ బలిగొంది. రోడ్డు పక్కన నిల్చున వారిపై ఆ లారీ బోల్తా పడడం వల్ల అక్కడికక్కడే వారంతా మృతిచెందారు. ఈ ఘటన జరిగిన అనంతరం లారీ డ్రైవర్ వెంటనే పరారయ్యాడు. పూర్తి కథనం కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

రూ.150 టికెట్‌తో 50 నిమిషాల ఫ్లైట్ జర్నీ- ఈ సూపర్ స్కీమ్ గురించి మీకు తెలుసా? - Cheapest Airplane Ticket In India

'2024లో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు'- IMD గుడ్​న్యూస్​ - Monsoon Prediction 2024 IMD

Last Updated :Apr 16, 2024, 8:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.