తెలంగాణ

telangana

Rupinder Pal Singh Retirement: టోక్యో కాంస్య పతక విజేత రిటైర్మెంట్​

By

Published : Sep 30, 2021, 2:28 PM IST

అంతర్జాతీయ హాకీకి తాను వీడ్కోలు పలుకుతున్నట్లు భారత హాకీ క్రీడాకారుడు రూపీందర్​ పాల్​ సింగ్​(Rupinder Pal Singh Retirement) గురువారం ప్రకటించాడు. టోక్యో ఒలింపిక్స్​లో(Tokyo Olympics) కాంస్య పతకం గెలిచిన జ్ఞాపకాలతో తాను రిటైర్మెంట్​ ప్రకటిస్తున్నట్లు తెలిపాడు.

India hockey star Rupinder Pal Singh hangs his boots
Rupinder Pal Singh Retirement: టోక్యో కాంస్య పతక విజేత రిటైర్మెంట్​

టోక్యో ఒలింపిక్స్​ కాంస్య పతక విజేత, భారత హాకీ క్రీడాకారుడు రూపీందర్​ పాల్​ సింగ్​ ఆటకు రిటైర్మెంట్​(Rupinder Pal Singh Retirement) ప్రకటించాడు. గురువారం నుంచి తన హాకీ కెరీర్​కు వీడ్కోలు పలుకుతున్నట్లు ట్విట్టర్​లో వెల్లడించాడు. చాలా ఏళ్ల తర్వాత ఒలింపిక్స్​లో(Tokyo Olympics) భారత హాకీ జట్టు తరఫున పతకం గెలవడం సంతోషాన్నిచ్చిందని అన్నాడు.

"అందరికీ నమస్కారం. భారత హకీ టీమ్​కు రిటైర్మెంట్​ ప్రకటించాలని నిర్ణయించుకున్నాను. ఇదే విషయాన్ని ఈ రోజు మీకు తెలియజేస్తున్నాను. నా జీవితంలోని గత కొన్ని నెలలు ఎంతో ఉత్తమంగా గడిచాయి. టోక్యో ఒలింపిక్స్​ వేదికగా సహచర క్రీడాకారులతో కలిసి ఎన్నో అనుభూతులను పంచుకున్నాను. నా జీవితంలో అత్యంత నమ్మశక్యం కాని అనుభూతులు అవి. గత 13 ఏళ్లుగా భారతదేశానికి ఆడటం గొప్పగా భావిస్తున్నాను. ప్రతిభావంతులైన క్రీడాకారులకు మార్గదర్శనం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. 223 మ్యాచుల్లో ఇండియా జెర్సీ ధరించే గౌరవం దక్కడం అనిర్వచనీయం. ఈ గొప్ప క్రీడను ఇష్టపడే దేశం కోసం ఆడే అవకాశం నాకు దక్కింది."

- రూపీందర్​ సింగ్​, భారత మాజీ హాకీ క్రీడాకారుడు

తన కెరీర్​తో పాటు జీవితంలో మద్దతుగా నిలిచిన హాకీ ఇండియా, కోచ్​లు, సన్నిహితులు సహా అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు రూపీందర్​ సింగ్​. 2010లో జరిగిన సుల్తాన్‌ అజ్లాన్‌ షా కప్‌ టోర్నీ ద్వారా హాకీలో అరంగేట్రం(Rupinder Pal Singh Career) చేశాడు రూపీందర్‌ పాల్‌ సింగ్‌. అంతర్జాతీయంగా భారత్​ తరఫున 223 మ్యాచులు ఆడిన రూపీందర్‌.. 119 గోల్స్‌ చేశాడు.

ఇటీవలే జరిగిన టోక్యో ఒలింపిక్స్​లో(Tokyo Olympics) భారత పురుషుల హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. లీగ్​ దశలో సత్తా చాటినప్పటికీ సెమీస్​ ఫైనల్​లో ఓడింది. ఆ తర్వాత కాంస్య పతకం కోసం జరిగిన పోరులో జర్మనీని 5-4 పాయింట్లతో ఓడించింది(Indian Men Hockey Team Olympics) భారత హాకీ జట్టు. ఈ విజయం తర్వాత పారిస్​ ఒలింపిక్స్​లో స్వర్ణ పతకం తమ లక్ష్యమని మన్​ప్రీత్​ సింగ్​ సారథ్యంలోని హాకీ టీమ్​ ధ్యేయంగా ముందుకు సాగుతుంది.

ఇదీ చూడండి..ICC T20 World Cup 2021: భారత జట్టులో మార్పులా?

ABOUT THE AUTHOR

...view details