తెలంగాణ

telangana

స్టాక్​ మార్కెట్లకు భారీ నష్టాలు, సెన్సెక్స్ 860 డౌన్, 80కి పతనమైన రూపాయి విలువ

By

Published : Aug 29, 2022, 4:11 PM IST

Updated : Aug 29, 2022, 5:01 PM IST

సోమవారం సెషన్​లో స్టాక్​ మార్కెట్లు నష్టపోయాయి. సెన్సెక్స్​ 861.25 పాయింట్లు నష్టపోయి 57,972.62 వద్ద ముగిసింది. నిఫ్టీ 246 నష్టపోయి 17,312.90 పాయింట్లకు చేరింది. మరోవైపు రూపాయి విలువ భారీగా పతనమైంది.

Stock Market Closing
Stock Market Closing-Sensex sinks 861.25 points and Nifty falls 246 points

Stock Market Closing: దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు నష్టాల్లో ముగిశాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 861.25 పాయింట్లు కోల్పోయి.. 57,972.62 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 246 పాయింట్ల నష్టంతో 17,312.90 వద్ద సెషన్​ను ముగించింది.

లాభపడిన షేర్లు..మారుతీ, నెస్లే, ఎసియన్​ పేయింట్స్, ఐటీసీ, ఎమ్​ అండ్​ ఎమ్, హిందుస్థాన్​ యూనిలీవర్​ కంపెనీల షేర్లు లాభపడ్డాయి.
నష్టపోయిన షేర్లు.. టెక్ మహీంద్ర భారీగా నష్టాలను చవిచూసింది. ఈ కంపెనీ షేర్లు 4.57 శాతం మేర పడిపోయాయి. ఇన్ఫోసిస్, విప్రో, హెచ్​సీఎస్​ టెక్నాలజీస్​, టీసీఎస్, కోటక్ మహీంద్ర బ్యాంక్​, టాటా స్టీల్, యాక్సిస్​ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్​, ఎస్​బీఐ షేర్లు కూడా భారీగా పతనమయ్యాయి.

అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు మార్కెట్‌లను నష్టాల్లోకి నెట్టాయి. ఏ దశలోనూ కొనుగోళ్ల మద్దతు లభించకపోవడం వల్ల రోజంతా అదే బాటలో పయనించాయి. అమెరికాలో ద్రవ్యోల్బణం రెండు శాతానికి చేరే వరకు రేట్ల పెంపు ఉంటుందన్న ఫెడరల్‌ రిజర్వు ఛైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ ప్రకటన మార్కెట్ల పతనానికి ప్రధాన కారణం. మరోవైపు రూపాయి బలహీనత, చమురు ధరలు ఎగబాకడం కూడా సూచీలను కలవరపెట్టింది. రిలయన్స్‌, విప్రో, టీసీఎస్‌ వంటి దిగ్గజ షేర్లు నష్టపోవడం కూడా మార్కెట్లకు ప్రతికూలంగా మారింది. విదేశీ మదుపరులు పెట్టుబడులు వెనక్కి తీసుకుంటారనే భయం సైతం నష్టాలకు కారణమైంది. ఎక్చేంజీ గణాంకాల ప్రకారం విదేశీ మదుపరులు శుక్రవారం రూ.51.12 కోట్ల పెట్టుబడులు వెనక్కుతీసుకున్నారు. ​

అంతర్జాతీయ మార్కెట్లు
ఆసియా మార్కెట్లు సోమవారం నష్టపోయాయి. షాంఘై స్టాక్ ఎక్స్ఛేంజీ కొంతమేర లాభపడింది. యురోపియన్ మార్కెట్లు కూడా ఒడుదొడుకులను ఎదుర్కొన్నాయి. గత శుక్రవారం అమెరికా మార్కెట్లు భారీగా నష్టపోయాయి.

రూపాయి విలువ..
రూపాయి విలువ మరోసారి పతనమైంది. సోమవారం ట్రేడింగ్​లో 10 పైసలు కోల్పోయింది. చివరకు 79.94 వద్ద స్థిరపడింది. 80.10 వద్ద ట్రేడింగ్​ ప్రారంభించిన రూపాయి.. ఓ దశలో జీవితకాల కనిష్ఠ స్థాయి అయిన 80.15కు పతనమైంది. చివరకు కాస్త పుంజుకుంది.

ఇవీ చదవండి:దీపావళి నాటికి జియో 5జీ సేవలు, మొదట ఆ నగరాల్లోనే

ఆయనకు గిఫ్ట్​గా లగ్జరీ విల్లా​ కొన్న అంబానీ, షాకింగ్ ధర

Last Updated :Aug 29, 2022, 5:01 PM IST

ABOUT THE AUTHOR

...view details