తెలంగాణ

telangana

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

By

Published : Jun 1, 2022, 10:11 AM IST

Gold Price Today: బంగారం, వెండి ధరలు బుధవారం భారీగా తగ్గాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 10 గ్రాముల పసిడి ధర రూ. 52,300గా ఉంది. కిలో వెండి ధర రూ. 63,080గా ఉంది. మరోవైపు మంగళవారం నష్టాల్లో ముగిసిన స్టాక్​ మార్కెట్​ సూచీలు.. బుధవారం సెషన్​లోనూ అదే బాటలో పయనిస్తున్నాయి.

Gold price today
Gold price today

Gold Price Today: ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం, వెండి ధరలు బుధవారం స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.400కుపైగా తగ్గి రూ.52,300కు చేరింది. కిలో వెండి ధర రూ. 750 మేర తగ్గి రూ.62,350గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయో చూద్దాం..

  • Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ. 52,300గా ఉంది. కిలో వెండి ధర రూ.62,350 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.52,300 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.62,350గా ఉంది.
  • Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.52,300గా ఉంది. కేజీ వెండి ధర రూ.62,350 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.52,300గా ఉంది. కేజీ వెండి ధర రూ.62,350 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే..అంతర్జాతీయంగా స్పాట్​ గోల్డ్​ ధర కూడా తగ్గింది. ఔన్సు బంగారం 1835 డాలర్లు పలుకుతోంది. స్పాట్ వెండి ధర.. ఔన్సుకు 21.47 డాలర్లుగా ఉంది.
ఇంధన ధరలు ఇలా..పెట్రోల్, డీజిల్ ధరలు బుధవారం స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

Cryptocurrency Price in India: క్రిప్టోకరెన్సీల్లో.. బిట్​కాయిన్​ విలువ మళ్లీ క్షీణించింది. ప్రస్తుతం రూ. 25,73,203 వద్ద ఉంది. ఇథీరియం, బినాన్స్​ కాయిన్​ మొదలైన ఇతర ప్రధాన క్రిప్టోకరెన్సీల ధరలు ఎలా ఉన్నాయంటే..

క్రిప్టోకరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.25,73,203
ఇథీరియం రూ.1,57,353
టెథర్ రూ.81.98
బినాన్స్​ కాయిన్ రూ.26,166
యూఎస్​డీ కాయిన్ రూ.82.40

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు: గత సెషన్​లో నష్టాలు నమోదుచేసిన దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు బుధవారం సెషన్​లోనూ నెగెటివ్​లో ట్రేడవుతున్నాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 100 పాయింట్లకుపైగా పడిపోయి.. 55 వేల 460 వద్ద ఉంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 40 పాయింట్లు కోల్పోయి.. 16 వేల 545 వద్ద కొనసాగుతోంది. జేఎస్​డబ్ల్యూ స్టీల్​, ఏషియన్​ పెయింట్స్​, టాటా స్టీల్​, ఎన్​టీపీసీ, కోల్​ ఇండియా లాభాల్లో ట్రేడవుతున్నాయి. బజాజ్​ ఆటో, హిందాల్కో, సన్​ ఫార్మా, అల్ట్రాటెక్​ సిమెంట్​, విప్రో నష్టపోయాయి.

ఇదీ చదవండి:భారీగా తగ్గిన వంట గ్యాస్​​ ధర!

'ఆరు ఎయిర్‌బ్యాగ్‌ల నిబంధన.. చిన్నకార్లకు గుదిబండే'

ABOUT THE AUTHOR

...view details