తెలంగాణ

telangana

Kerala Covid Cases: కేరళలో 19వేలకుపైగా కొత్త కేసులు

By

Published : Sep 19, 2021, 9:32 PM IST

Updated : Sep 19, 2021, 10:59 PM IST

kerla covid cases
కేరళలో కరోనా కేసులు

కేరళలో కొత్తగా 19,653 మందికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది. మరో 152 మంది ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలో ఒక్కరోజే 3,413 కొవిడ్​ కేసులు వెలుగు చూశాయి. వివిధ రాష్ట్రాల్లో కరోనా ఉద్ధృతి ఎలా ఉందంటే..?

కేరళలో కరోనా కేసులు (Kerala Covid Cases) స్థిరంగా కొనసాగుతున్నాయి. కొత్తగా 19,653 మందికి వైరస్ సోకింది. మరో 26,711 మంది కోలుకోగా.. మహమ్మారి ధాటికి 152 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 45.08 లక్షలకు చేరింది. ఇప్పటివరకు 23,591 మంది వైరస్​ బారిన పడి మృతిచెందారు.

కేరళలో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో.. వైరస్ కట్టడికి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం కీలక నిర్ణయం తీసుకుంది. వారంలో వైరస్ సోకే వారి రేటు(వీక్లీ ఇన్​ఫెక్షన్ పాపులేషన్ రేషియో) 10 కంటే ఎక్కువగా నమోదయ్యే జిల్లాలో ఆంక్షలు కఠినతరం చేయనున్నట్లు తెలిపింది. ఆయా జిల్లాల్లో కఠిన లాక్​డౌన్​ విధించనున్నట్లు చెప్పింది.

మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొత్తగా ఆ రాష్ట్రంలో 3,413 మందికి వైరస్ సోకినట్లు తేలింది. మరో 49 మంది మరణించారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 65,21,915కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 1,38,518కి పెరిగింది.

మరోవైపు.. దేశ రాజధాని దిల్లీలో 28 మందికి వైరస్​ సోకింది. వైరస్ ధాటికి కొత్తగా ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు.

వివిధ రాష్ట్రాల్లో కేసులు..

  • కర్ణాటకలో కొత్తగా 783 కేసులు నమోదయ్యాయి. 1,139 మంది కోలుకోగా.. 16 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • తమిళనాడులో 1,697 కరోనా కేసులు నమోదవగా.. వైరస్ ధాటికి మరో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 1,594 మంది వైరస్​ను జయించారు.
  • ఒడిశాలో కొత్తగా 623 మందికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది. మరో ఏడుగురు మృతిచెందారు.
  • గుజరాత్​లో ఈ ఏడాదిలో తొలిసారి కరోనా రోజువారీ కేసుల సంఖ్య 10 కంటే తక్కువకు పడిపోయింది. ఆ రాష్ట్రంలో కొత్తగా 8 మందికి కరోనా సోకినట్లు తేలింది. మరో 15 మంది కోలుకున్నారు.

ఇదీ చూడండి:COVID-19: గాలి ద్వారా వ్యాపించేలా కరోనా రూపాంతరం

ఇదీ చదవండి:చిన్న పిల్లలకు వ్యాక్సినేషన్ షురూ.. 2-10 ఏళ్ల వారికి...

Last Updated :Sep 19, 2021, 10:59 PM IST

ABOUT THE AUTHOR

...view details