తెలంగాణ

telangana

'ఆడియో టేప్​'పై కేంద్ర మంత్రికి నోటీసులు

By

Published : Jul 20, 2020, 3:18 PM IST

ఆడియో టేపుల కేసులో కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్‌కు రాజస్థాన్‌ పోలీసులు నోటీసులు జారీ చేశారు. రాజస్థాన్​ సర్కారును కూల్చడానికి ప్రయత్నించారన్న కేసులో వాంగ్మూలం ఇవ్వాలని వాటిలో పేర్కొన్నారు.

Special Operations Group (SOG) of #Rajasthan Police has sent a notice through my personal secretary: Shekhawat
'ఆడియో టేప్​'పై కేంద్ర మంత్రికి నోటీసులు!

రాజస్థాన్‌లో రాజకీయ కలకలం రేపిన ఆడియో టేపుల వ్యవహారంలో దర్యాప్తు ముమ్మరమైంది. టేపుల విషయంలో కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్‌కు రాజస్థాన్‌ స్పెషల్‌ ఆపరేషన్‌ గ్రూప్‌(ఎస్‌ఓజీ) పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో వాంగ్మూలం ఇవ్వాలని, విచారణ కోసం తన గొంతుతో సాంపిల్​ ఆడియో క్లిప్ రికార్డు చేసి పంపాలని వాటిలో పేర్కొన్నారు.

అశోక్ గహ్లోత్‌ సర్కారును కూల్చివేయడానికి శాసనసభ్యులను ప్రలోభపెట్టే సంభాషణలుగా చెబుతున్న ఆడియో టేపులపై కాంగ్రెస్‌ ఫిర్యాదు మేరకు ఎస్‌ఓజీ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన విషయం తెలిసిందే. గజేంద్ర షెకావత్‌తో పాటు కాంగ్రెస్‌ బహిష్కృత ఎమ్మెల్యే భన్వర్‌లాల్‌ శర్మ, ఈ వ్యవహారంలో మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నట్లు భావిస్తున్న సంజయ్‌ జైన్‌ పేర్లను కూడా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు.

సంజయ్‌ జైన్‌ను ఇప్పటికే అరెస్టు చేసిన పోలీసులు పలు దఫాలు ప్రశ్నించారు. తాజాగా గజేంద్ర సింగ్‌కు నోటీసులు పంపారు. ఈ ఆరోపణలపై ఇప్పటికే స్పందించిన ఆయన.. ఆ ఆడియో టేపుల్లో ఉన్నది తన గొంతు కాదని తెలిపారు. ఎలాంటి విచారణకైనా సిద్ధమని స్పష్టంచేశారు. రాజకీయ కుట్రలో భాగంగానే కాంగ్రెస్‌ తనపై ఆరోపణలు చేస్తోందన్నారు షెకావత్.

ఇదీ చదవండి: రాజస్థాన్​ కాంగ్రెస్ నేతల హంగామా.. హోటల్​లో 'అంత్యాక్షరి'

TAGGED:

ABOUT THE AUTHOR

...view details