ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మైనార్టీలను మోసం చేసిన వైసీపీ సర్కారు - రాష్ట్ర వ్యాప్తంగా మైనార్టీ వర్క్​షాప్ : షరీఫ్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 22, 2023, 12:52 PM IST

TDP_Minority_Workshop

TDP Minority Workshop: మైనారిటీలను తెలుగుదేశం పార్టీకి మరింత దగ్గరగా చేసేందుకు ఈ నెల 25, 26 తేదీలో ఎనిమిది జిల్లాల్లో మైనార్టీల వర్క్ షాప్ ఏర్పాటు చేస్తున్నట్లు శాసనమండలి మాజీ ఛైర్మన్ షరీఫ్ వెల్లడించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌లో టీడీపీ మైనారిటీ సెల్ రాష్ట్ర నాయకులు సమావేశమయ్యారు. డిసెంబర్ 2వ తేదీ నుంచి 20 రోజులు పాటు 46 నియోజకవర్గాల్లో సమన్వయ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 

TDP Sharif Fire on YCP Govt: రాష్ట్రంలో 50 నియోజకవర్గాల్లో మైనార్టీలు 20 శాతం వరకు ఉన్నారని, గతంలో టీడీపీ.. ముస్లిం మైనారిటీలకు ఏ విధంగా రక్షణ కల్పించిందనే విషయాన్ని ఆయా వర్గాలకు వివరిస్తామన్నారు. వైసీపీ ప్రభుత్వం మైనారిటీ ఓట్లు దండుకుని ఏ విధంగా వారిని మోసం చేసి.. వారిపై దాడులకు తెగబడిందనే విషయాన్ని క్షేత్రస్థాయిలో వివరిస్తామని స్పష్టం చేశారు. మైనారిటీలకు బడ్జెట్లో డబ్బులు కేటాయించి వాటిని నవరత్నాలకు మళ్లించిందని ఆరోపించారు. గడిచిన నాలుగేళ్లలో వంద మందికి పైగా మైనారిటీలపై దాడులకు పాల్పడ్డారని మండిపడ్డారు. మైనారిటీల మీద దాడులు చేయటమే కాకుండా హత్యలకు కూడా పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details