ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Pournami Garuda Seva in Tirumala: వైభవంగా తిరుమలేశుడి పౌర్ణమి గరుడసేవ

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 30, 2023, 12:25 PM IST

Pournami_Garuda_Seva_in_Tirumala

Pournami Garuda Seva in Tirumala: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి పౌర్ణమి గరుడ సేవను టీటీడీ ఘనంగా నిర్వహించింది. వర్షం కారణంగా ఘటాటోపం లోపల స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు స్వామి వారి వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.  రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారికి జరిగే గరుడసేవను తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారు గరుడ వాహనంపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తున్న సమయంలో ఆ ప్రాంతమంతా గోవింద  నామాలతో మారుమోగింది. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను కలిగి ఉంది. గరుడవాహనం ద్వారా ఆ అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుడైన స్వామివారు తాను దాసుదాస ప్రపత్తికి దాసుడని తెలియజేస్తారని పురాణాలు వివరిస్తున్నాయి. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు.. జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడిని దర్శిస్తే వారి సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి విశ్వాసం.

ABOUT THE AUTHOR

...view details