ఆంధ్రప్రదేశ్

andhra pradesh

జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉపాధ్యాయులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి : పరిటాల సునీత

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 11, 2023, 4:59 PM IST

ex-minister_paritala_sunitha_fires_on_ycp_government

EX-Minister Paritala Sunitha Fires On YCP Government :రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉపాధ్యాయులను ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చారని మాజీ మంత్రి పరిటాల సునీత మండిపడ్డారు. ఆత్మహత్యాయత్నం చేసి అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు మల్లేష్​ను పరిటాల సునీత పరామర్శించారు. కుటుంబ సభ్యులకు రూ. 50 వేలు ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారు.

EX-Minister Paritala Sunitha :ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చిన వారంలోపు సీపీఎస్ రద్దు చేస్తానన్న మాట ఏమైందని ప్రశ్నించారు. సకాలంలో జీతాలు చెల్లించడంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందన్నారు. చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయులతో ఇతర పనులు చేయిస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర మనోవేదకు గురై మల్లేష్ ఆత్మహత్యాయత్నం చేసుకుంటే వైసీపీ నాయకులు దాన్ని మరో రకంగా చిత్రీకరిస్తున్నారని చెప్పారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు మానుకోవాలని హెచ్చరించారు. మల్లేష్ కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో ఉన్న ఉద్యోగస్తులంతా ధైర్యంగా ఉండాలని, రానున్న కాలంలో టీడీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు సీఎం అయిన తర్వాత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details