ఆంధ్రప్రదేశ్

andhra pradesh

జంగారెడ్డిగూడెంలో ప్రశాంతంగా మేడే వేడుకలు

By

Published : May 1, 2020, 4:25 PM IST

లాక్​డౌన్ నిబంధనతో పశ్చిమగోదావరి జిల్లాలో మేడే వేడుకలు ప్రశాంతంగా జరిగాయి. తెదేపా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు భౌతిక దూరం పాటిస్తూ జెండా ఆవిష్కరించారు.

peacefull mayday celebrations in jangareddygudem west godavari district
నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్న నాయకులు

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో మేడే వేడుకలు ప్రశాంతంగా జరిగాయి. తెదేపా పార్టీ ఆధ్వర్యంలో నేతలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి జెండా ఆవిష్కరించారు. ఆర్టీసీ డిపో వద్ద పలు యూనియన్ నాయకులు జెండాలు ఎగరవేశారు. కార్మికులకు తెదేపా నాయకులు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details