ETV Bharat / state

తణుకులో పేదలకు కూరగాయల పంపిణీ

author img

By

Published : May 1, 2020, 4:09 PM IST

కరోనా విపత్తు సమయంలో తినడానికి తిండిలేక అల్లాడుతున్న పేదలను ఆదుకోవడానికి దాతలు, స్వచ్ఛంద సంస్థలు తమకు తోచిన రీతిలో స్పందిస్తున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా తణుకులోని పేద కుటుంబాలకు అమ్మాజీ ట్రస్ట్ ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ చేశారు.

west godavari district
కూరగాయలు పంపిణీ చేసని దాతలు

పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణంలోని 19వ వార్డులో పేదలకు.. పట్టణానికి చెందిన సప్పా సింహాచలం, అమ్మాజీ ట్రస్ట్ ఆధ్వర్యంలో సప్పా బలరామకృష్ణ ఆర్థిక సహకారంతో కూరగాయలు పంపిణీ చేశారు. ప్రతి ఇంటికి వంద రూపాయలకు పైగా విలువైన కూరగాయలు అందించారు. విపత్తు కాలంలో ఇబ్బందుల్లో ఉన్న పేదవారిని ఆదుకోవడానికి తమ వంతు సాయం అందించినట్లు బలరామకృష్ణ తెలిపారు.

ఇదీ చదవండి..

ఎట్టకేలకు... స్వస్థలాలకు వలస కూలీలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.