విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలోని కొమరాడ మండలం పాత కళ్లికోట గ్రామ పరిధిలో... అరటి, కాకర, చెరుకు, బొప్పాయి పంటలను ఏనుగులు ధ్వంసం చేస్తున్నాయి. ఎక్కువ మోతాదులో పంటనష్టం జరిగినా... అటవీశాఖ అధికారులు పట్టించుకోవడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నోటి వరకూ వచ్చిన పంటను ఏనుగులు నాశనం చేస్తున్నాయని రైతులు వాపోతున్నారు. అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.
Intro:Body:Conclusion: