ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అన్న క్యాంటీన్లను మూసి పేదల పొట్టకొట్టిన జగన్‌ - నిరుపయోగంగా భవనాలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 5, 2023, 9:55 AM IST

Updated : Dec 5, 2023, 11:13 AM IST

YSRCP Government Close Anna Canteen: ప్రజల కనీస అవసరాలైన కూడు, గూడు, గుడ్డ సమకూరేలా చూడటం పాలకుల కనీస బాధ్యత. అందుకే కూలీలు, చిరుద్యోగులను దృష్టిలో ఉంచుకొని చాలా ప్రభుత్వాలు వివిధ పథకాల రూపంలో తక్కువ ధరకే ఆహారం అందిస్తుంటాయి. ఆకలి బాధ తీర్చే ఆలోచనలకు ధార్మిక సంస్థలూ ముందుంటాయి. సదాశయంతో టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 'అన్న క్యాంటీన్‌'లను వైసీపీ అధికారంలోకి రాగానే పట్టుబట్టి మరీ నామరూపాల్లేకుండా చేశారు. పేద ప్రజల కడుపుపైన కొట్టి జగన్‌ తన కడుపుమంటను చల్లార్చుకున్నారు.

YSRCP_Government_Close_Anna_Canteen
YSRCP_Government_Close_Anna_Canteen

అన్న క్యాంటీన్లను మూసి పేదల పొట్టకొట్టిన జగన్‌ - నిరుపయోగంగా భవనాలు

YSRCP Government Close Anna Canteen : శత్రువైనా సరే ఆకలితో ఇంటికి వస్తే, కడుపు మాడ్చుకొనైనా అన్నం పెడతారు. అలా చేయడం ధర్మం కూడానూ. కానీ జగనన్న తీరే వేరు. యువతకు ఉపాధినిచ్చే పరిశ్రమలైనా, అట్టడుగు వర్గాలకు అండగా నిలిచే ప్రత్యేక పథకాలైనా, పాలనా సౌకర్యం కోసం నిర్మించుకున్న ప్రజా వేదికైనా,పేదల కడుపు నింపే 'అన్న క్యాంటీన్‌' అయినా, కూలిపోవడమో, తరలిపోవడమో, నిర్వీర్యమవడమో, నిరుపయోగం కావడమో ఏదో ఒకటి జరిగి తీరాల్సిందే.

CM Stalin Continue Amma Canteen in Tamil Nadu :తమిళనాడులో జయలలిత (Jayalalithaa) ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏర్పాటు చేసిన అమ్మ క్యాంటీన్లను, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన స్టాలిన్‌ (Stalin) అదే పేరుతో కొనసాగిస్తున్నారు. కానీ, పేదలు కడుపారా తినడం జగన్‌కు ఏమాత్రం గిట్టదు కదా? అందుకే టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌లను మూసివేసి వారి పొట్టకొట్టారు. టీడీపీ ప్రభుత్వం కట్టిన క్యాంటీన్లన్నీ ప్రజా ధనంతో కట్టినవే. కేవలం 5 రూపాయలకే పేదలకు అన్నం పెట్టేవి. ఒకప్పుడు పేదల ఆకలి తీరుస్తూ కళకళలాడిన అన్న క్యాంటీన్లు ఇప్పుడు చాలాచోట్ల మూత్రవిసర్జనకు, చెత్తకుప్పలకు, అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మారాయి. అధికశాతం భవనాలను వృథాగా వదిలేస్తే, మరికొన్నింటికి వైసీపీ రంగులేసుకుని గ్రామ, వార్డు సచివాలయాలుగా మార్చేసుకున్నారు.

పేదోళ్ల కడుపు మంటలే వైసీపీ ప్రభుత్వానికి చితి మంటలు : నారా లోకేశ్

నిరుపయోగంగా కడుపు నింపే నిలయాలు : అన్నం పరబ్రహ్మ స్వరూపమంటారు. ఆహారంతో పాటు ఆ ప్రదేశాన్ని కూడా దైవసమానంగానే చూడాలి. కానీ జగన్‌ మనస్తత్వమే వేరు. పేదలంటే ఆయనకు ఎంత చిన్నచూపో అనంతపురం నగరంలోని కనకదాసు కూడలి వద్దనున్న అన్న క్యాంటీన్‌ను చూస్తే తెలిసిపోతుంది. ఒకప్పుడు రోజూ వందల మందికి అన్నం పెట్టిన క్యాంటీన్‌ను చెత్త కుప్పలతో దుర్గంధభరితంగా మార్చేశారు. నగరంలోని మదర్‌థెరిసా విగ్రహం వద్దనున్నఅన్న క్యాంటీన్‌ పిచ్చిమొక్కలకు నిలయంగా మారింది.

YCP Shuts Down Anna Canteen in AP : అమరావతి పరిధిలోని అన్న క్యాంటీన్‌ ఇది. కరకట్టకు ఆనుకొనే, అప్పటి సీఎం చంద్రబాబు (CM Chandrababu) నివాసానికి దగ్గరలో ఉండేలా దీన్ని నిర్మించారు. సీఎంను కలిసి సమస్యలు చెప్పుకొనేందుకు వచ్చే పేదలు, రాజధాని సందర్శనకు వచ్చే ప్రజలు కడుపు నిండా ఇక్కడ అన్నం తినేవారు. అమరావతిని నిర్వీర్యం చేసినట్టే, అన్న క్యాంటీన్లను కూడా మూలకు పెట్టేశారు. ఇప్పుడది మందుబాబులకు, అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మారింది.

తెదేపా అధికారంలోకి వస్తే అన్న క్యాంటీన్లు మళ్లీ తెరుస్తాం: అశోక్‌గజపతి

వైసీపీ ప్రభుత్వంలో తెరవని అన్న క్యాంటీన్ : శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో అన్న కాంటీన్‌ భవనం ప్రారంభానికి నోచుకోకముందే శిథిలావస్థకు చేరుకుంటోంది. టీడీపీ హయాంలో ఈ భవన నిర్మాణానికి నిధులు కేటాయించి పనులు చేపట్టారు. ఎన్నికలు రావడంతో కొంతకాలం పనులు ఆగిపోయాయి. ఆ తరువాత వైసీపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్లను మూసివేసింది. అయినప్పటికీ ఇక్కడ పనులు జరిగాయి. మొత్తానికి భవనం పూర్తయింది కానీ, ప్రారంభానికి నోచుకోలేదు.

Anna Canteen Worst Situation in AP :ఇది విజయనగరంలోని అన్న క్యాంటీన్‌. ఒకప్పుడు పొట్ట కూటీ కోసం నగరానికి వచ్చే కూలీలు, పేద విద్యార్ధులకు 5రూపాయాలకే కడుపార భోజనం అందించిన కేంద్రం ఇది. ఇప్పుడు చెత్త కుప్పలు, పిచ్చిమొక్కలతో దర్శనమిస్తోంది. అధ్వానకర స్థితిలో ఉన్న ఈ అన్న క్యాంటీన్‌ విశాఖలోనిది. నిత్యం కార్మికులతో కిటకిటలాడే పూర్ణ మార్కెట్‌కు సమీపంలోనే ఉంది. వేల మంది పేదల ఆకలిని తీర్చే ఈ కేంద్రం ఇప్పుడు పూర్తిగా కళ తప్పింది. శునకాలకు నివాసంగా మారింది.

అన్నక్యాంటీన్ల మూసివేతపై..రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు

Last Updated : Dec 5, 2023, 11:13 AM IST

ABOUT THE AUTHOR

...view details