ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ELECTRIC SHOCK: పరిశ్రమలో విద్యుదాఘాతం.. ఇద్దరు మహిళలు మృతి

By

Published : Sep 15, 2021, 10:45 PM IST

ELECTRIC SHOCK

శ్రీకాకుళం జిల్లా పద్మతుల గ్రామంలో ఓ పరిశ్రమలో జరిగిన విద్యుత్​ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం పద్మతుల గ్రామంలో తినుబండారాలు తయారు చేసే చిన్న పరిశ్రమలో ఘోరప్రమాదం చోటు చేసుకుంది. విద్యుదాఘాతంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. పరిశ్రమ యజమానురాలు కప్ప హేమలతతో పాటు, పిరియా రజనీ అనే మహిళ.. ఈ ప్రమాదంలో మృతి చెందారు.

మృతురాలు హేమలతకు భర్త వెంకటరావుతో పాటు ఒకటో తరగతి చదువుతున్న బాబు, ఐదేళ్ల పాప ఉన్నారు. ఇదిలా ఉండగా.. రజనీకి ఆరో తరగతి చదువుతున్న కుమారుడు సాయితో పాటు మూడో తరగతి చదువుతున్న సాత్విక్ ఉన్నారు. ఈ ఘటనతో ఇరు కుటుంబాలకు చెందిన నలుగురు చిన్నారులు తల్లులు లేని పిల్లలయ్యారు. ఈ ఘటనతో గ్రామంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

నిలకడగా వంశధార నది ప్రవాహం

ABOUT THE AUTHOR

...view details