People panic in srikakulam: శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో ఎలుగుబంట్ల సంచారం కలకలం రేపుతోంది. మందస, వజ్రపుకొత్తూరు మండలాల పరిధిలో ఇటీవల ఎలుగుబంట్ల సంచారం పెరిగిపోయింది. వాటి దాడిలో వజ్రపుకొత్తూరు మండలానికి చెందిన పలువురు మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎలుగుబంట్ల సంచారం ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది. తాజాగా.. ఓ టీ దుకాణంలో పిల్లలతో కలిసి ఎలుగుబంటి తిరుగుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. దీంతో ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు.
ఛాయ్ దుకాణానికి ఎలుగుబంటి.. పిల్లలతో సహా వచ్చేసింది!
Bears coming into villages: శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబంట్లు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇటీవల వీటి దాడిలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా.. ఓ ఛాయ్ దుకాణంలో పిల్లలతో కలిసి ఎలుగుబంటి సంచరిస్తున్న వీడియో వైరల్గా మారింది.
ఎలుగుబంట్ల బీభత్సం