ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాలను గాలికొదిలేసిన ప్రభుత్వం-ఉడకని అన్నం, నీళ్ల చారు, పులిసిన మజ్జిగతో విద్యార్థుల అవస్థలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 11, 2023, 9:29 AM IST

Updated : Nov 11, 2023, 1:41 PM IST

Non Management Welfare Hostels: నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అంటూ పదేపదే పలికే సీఎం జగన్.. వాస్తవానికి వారిపై కపట ప్రేమ చూపుతున్నారు. నెల్లూరులోని కొండాయిపాలెం గేటు వద్ద ఉన్న ఎస్సీ కళాశాల వసతి గృహమే అందుకు నిదర్శనం.

YSRCP_Government_Negligence_on_Welfare_Hostels
YSRCP_Government_Negligence_on_Welfare_Hostels

ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాలను గాలికొదిలేసిన ప్రభుత్వం-ఉడకని అన్నం, నీళ్ల చారు, పులిసిన మజ్జిగతో విద్యార్థుల అవస్థలు

YSRCP Government Negligence on Welfare Hostels :నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అంటూపదేపదే పలికే సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy).. వాస్తవానికి వారిపై కపట ప్రేమ చూపుతున్నారు. పేద పిల్లలుండే వసతి గృహాలను పూర్తిగా గాలికి వదిలేసి వారి జీవితాలను చీకట్లోకి నెట్టారు. మెనూ ఛార్జీలు (Menu Charges) పెంచామంటూనే ఉడకని అన్నం, నీళ్ల చారు, పులిసిన మజ్జిగ, పురుగులుపట్టిన పల్లీపట్టీలు పెడుతున్నారు. టాయిలెట్లు బాగోలేక కనీసం మంచి నీరు కూడా రాక నెల్లూరు జిల్లాలో వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులు నరకయాతన అనుభవిస్తున్నారు.

Government Hostels Situation Under CM Jagan Ruling :ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ వారికి కార్పొరేట్ స్థాయిలో వసతి కల్పిస్తున్నామంటూ ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి.నెల్లూరు నగరంలో జిల్లా అధికారులు నిత్యం తిరిగే ప్రాంతంలో కొండాయిపాలెం గేటు వద్ద ఎస్సీ కళాశాల వసతి గృహమే అందుకు నిదర్శనం. పెచ్చులూడిన గోడలు, చెత్తాచెదారం, తలుపుల్లేని గదులు, అపరిశుభ్ర మరుగుదొడ్లు, తిరగని ఫ్యాన్లు, నీళ్లు రాని కులాయిలు ఇలా అణువణువునా పాలకుల నిర్లక్ష్యం కనిపిస్తోంది. విద్యార్థులు నేలపైనే నిద్రించాల్సిన దుస్థితి. పారిశుద్ధ్యం లోపించి ఈగలు, దోమలతో విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారు. ఇదే ప్రాంతంలోని మరో వసతి గృహం భవనం కూడా ఇంత దారుణంగా ఉన్నా రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు.

వసతిగృహాలా జైళ్లా? విద్యార్థులకు కనీస సౌకర్యాలు పట్టించుకోని ప్రభుత్వం - చలికి వణుకుతూ నేలపైనే నిద్ర

Welfare Hostels Situation in Nellore :ఆర్వో ప్లాంట్ పాడయై నెలలు గడుస్తున్నా కనీసం దానికి మరమ్మతులు చేయలేదు. తాగు నీరు లేక విద్యార్థులు బయట నుంచి కొనుక్కుని తెచ్చుకుంటున్నారు. మెనూ ఛార్జీలు పెంచి పౌష్టికాహారం అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా వాస్తవానికి దారుణంగా ఉందని విద్యార్థుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

విద్యార్థి సంఘ నాయకుల హెచ్చరికలు : నెల్లూరు జిల్లాలో ఎక్కువగా ప్రభుత్వం హాస్టల్స్ ఉన్నాయి. జిల్లాలో 59 ఎస్సీ వసతి గృహాలు , 63 బీసీ వసతి గృహాలు ఉన్నాయి. నెల్లూరులో 3 బీసీ , 6 ఎస్సీ వసతి గృహాలు ఉన్నాయి. అన్ని హాస్టళ్లల్లోనూ ఇదే దుస్థితి. ప్రహారీలు లేక విద్యార్థులకు భద్రత కరవైంది. సమస్యలను వార్డెన్ దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా పరిస్థితిలో ఏ మార్పూ లేదు. ప్రభుత్వం ఇప్పటికైనా హాస్టల్‌లో మౌలిక వసతులు కల్పించి విద్యార్థుల బాగోగులు చూడాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు చేపడతామని విద్యార్థి సంఘ నాయకులు హెచ్చరిస్తున్నారు.

Social Welfare Hostels Problems: నీళ్ల పప్పు.. పురుగుల అన్నం.. సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల అవస్థలు

వసతి గృహాల్లో బిక్కుబిక్కుమంటున్న విద్యార్థులు : వసతి గృహాల్లో కనీస మౌలిక వసతులు లేక.. చాలా మంది విద్యార్థులు ఖాళీ చేసి వెళ్లిపోయారు. బయట డబ్బులు కట్టే స్థోమత లేని వారు ఇక్కడే బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు.

కింద పడుకోవాల్సి వస్తే మన పిల్లల్ని హాస్టల్స్​లో చేరుస్తామా- ప్రభుత్వంపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు

Last Updated : Nov 11, 2023, 1:41 PM IST

TAGGED:

ABOUT THE AUTHOR

...view details