ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ప్రభుత్వం మారింది.. నెల్లూరు సిటీ పార్క్​ మూతపడింది

By

Published : Dec 19, 2022, 3:31 PM IST

City Park Closed: ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించే నెల్లూరు సిటీ పార్కు మూతపడింది.. టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన ఈ పార్కును.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిరూపయెగంగా మార్చింది.. అసలు ఎందుకు ఈ పార్కు మూసివేశారంటే..!

City forest
నగర వనం

City Park Closed: నెల్లూరు సిటీ పార్క్ మూతపడింది. టీడీపీ హయాంలో హరితాంధ్రప్రదేశ్‌ నినాదంతో.. నెల్లూరు సమీపంలో 150 ఎకరాల్లో ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు నాలుగు కోట్ల రూపాయల నిధులతో 2019 నవంబర్​లో మాజీ మంత్రి నారాయణ ప్రారంభించారు. ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో నగరవనం మూతపడింది.

ఇటీవల ప్రభుత్వం కొంత నిధులు కేటాయించడంతో మెుక్కలకు నీళ్లు పోయడం, పార్క్‌లో అక్కడక్కడ మెరుగులు దిద్దుతున్నామని అధికారులు తెలిపారు. అయితే నేటికీ పార్క్‌లోకి అనుమతించడం లేదని నగరవాసులంటున్నారు. 150 ఎకరాల నగరవనం అటవీ శాఖ అధ్వర్యంలో అభివృద్ధి చేసి.. తొమ్మిది లక్షల మంది ప్రజలకు అహ్లాదకరమైన వాతావరణం కల్పించారు. ఇప్పటికైనా మూసివేసిన నగరవనాన్ని ప్రారంభించాలని ప్రజలు కోరుతున్నారు.

ప్రభుత్వం మారింది.. నెల్లూరు సిటీ పార్క్​ మూతపడింది

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details