నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలంలో మద్యం రవాణాపై సెబ్ అధికారులు ఉక్కు పాదం మోపారు. మినగల్లు, పాత దేవరాయ పల్లి గ్రామాల పరిధిలో సోదాలు చేశారు. మినగల్లు వద్ద ఆటోలో తరలిస్తున్న 400 మద్యం బాటిళ్లు స్వాధీనం చెసుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఆటోను సీజ్ చెశారు. వీరు కర్ణాటక నుంచి మద్యం తీసుకుని వచ్చి బెల్టుషాపులకు అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించారు. మరోవైపు.. పాతదేవరాయ పల్లి గ్రామంలో గడ్డి వామిలో నిల్వ వుంచిన 120 మద్యం బాటిళ్ళను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని విక్రయిస్తున్న కృష్ణ అనే వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలిపారు.
కర్నూలులో..