ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఆత్మకూరు ఉపఎన్నికల ప్రచారంలో వైకాపా వర్గ విబేధాలు.. నేతల ముందే రాళ్ల దాడి

By

Published : Jun 18, 2022, 7:51 PM IST

వైకాపా

ఆత్మకూరు ఉపఎన్నికల ప్రచారంలో వైకాపాలో వర్గవిబేధాలు తెలెత్తాయి. ఎమ్మెల్యే ద్వారకానాథ్‌రెడ్డి, వైకాపా అభ్యర్థి విక్రమ్‌రెడ్డి ముందే ఇరువర్గాల నేతలు రాళ్లతో దాడి చేసుకున్నారు.

నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉపఎన్నికల ప్రచారంలో అధికార పార్టీలో వర్గ విభేదాలు తలెత్తాయి. దాంతో ఏఎస్​పేట మండలం చౌటభీమవరంలో ఉద్రిక్తత నెలకొంది. ప్రచార వాహనం ఎక్కే విషయంలో సర్పంచి, మరో వర్గం మధ్య ఘర్షణ తలెత్తింది. ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి, వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి విక్రమ్ రెడ్డి ముందే పరస్పరం ఒకరిపై మరొకరు దాడికి దిగారు. రాళ్లతో పరస్పరం దాడికి చేసుకున్నారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details